Posted on 2026-05-08 08:00:03
ప్రేమించిన పాపానికి సికింద్రాబాద్లో నడిరోడ్డుపై యువకుడి దారుణంగా హత్య
కత్తితో 17 చోట్ల పొడిచి హతమార్చిన యువతి బంధువులు ?
డైలీ భారత్, హైదరాబాద్: జవహర్నగర్ ప్రాంతంలో నివాసం ఉంటూ నాలుగేళ్లుగా సీతాఫల్మండి ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్న యావన్(23) అనే బీటెక్ 3rd ఇయర్ చదువుతున్న యువకుడు
ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు ఎన్నిసార్లు హెచ్చరించినా వినకుండా, సీతాఫల్మండి ప్రాంతంలో ఉండే తన స్నేహితుడి ఇంట్లో ఉంటూ తరచూ యువతిని కలుస్తున్న యావన్
దీంతో నిన్న రాత్రి మూడు ద్విచక్ర వాహనాలపై వచ్చి యావన్పై కత్తులతో దాడి చేసిన ఆరుగురు దుండగులు
వారి నుండి తప్పించుకుని బయటికి వచ్చినా వదలకుండా దారుణంగా నడిరోడ్డుపై హతమార్చిన నిందితులు
17 చోట్ల కత్తి పోట్లకు గురి కావడంతో అక్కడికక్కడే మృతి చెందిన యువకుడు
యువకుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రేమించిన యువతి ఇంటి ముందు ఆందోళనకు దిగిన యవన్ కుటుంబసభ్యులు
హత్యపై సీతాఫల్మండీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రేమించిన పాపానికి సికింద్రాబాద్లో యువకుడిని దారుణంగా హతమార్చారు. దీంతో యవన్ కుటుంబసభ్యులు మృతదేహంతో యువతి బంధువులు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎలాంటి గొడవలు చోటు చేసుకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >