Posted on 2026-04-14 19:15:28
డైలీ భారత్, కామరెడ్డి: కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి డిజిపి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వారితో పాటు ఐ జి పి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గార్లు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ గౌరవ వందనం సమర్పించారు.
"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి
Posted On 2026-04-18 13:51:32
Readmore >
నిడదవోలులో మహిళా సాధికారతకు మద్దతుగా సీఎం చంద్రబాబు నిరసన ర్యాలీ
Posted On 2026-04-18 13:41:10
Readmore >
రహదారి ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 18:00:32
Readmore >