Posted on 2026-04-13 19:09:44
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార కేసులో (Cr. No. 434/2024) నాంపల్లి XII అదనపు సెషన్స్ కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి టి. అనిత నిందితుడికి సహజ మరణం వరకు కఠిన కారాగార జీవితం (లైఫ్ ఇంప్రిజన్మెంట్) విధిస్తూ, భారీ జరిమానా కూడా విధించారు.
2024 మే 11న నమోదైన ఈ కేసులో బాధితురాలు కర్నూలు జిల్లా బాలికా విద్యాలయంలో 9వ తరగతి చదువుతోంది. సెలవుల సమయంలో ఇంటికి వచ్చిన ఆమె, మే 10న కడుపునొప్పితో అమీర్పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
పోలీసుల దర్యాప్తులో, వారి ఇంటి ఎదురుగా నివసించే మడకారు శ్రీనివాసులు అనే వ్యక్తి, బాధితురాలు తన కుమారుడితో ఆడుకోవడానికి వచ్చిన సమయంలో లైంగిక దాడికి పాల్పడినట్లు, దాని ఫలితంగా ఆమె గర్భవతి అయినట్లు నిర్ధారణ అయ్యింది.
నిందితుడు: మడకారు శ్రీనివాసులు (26)
నివాసం: దాసరాం బస్తీ, బి.కె గూడ, హైదరాబాద్
స్వస్థలం: గుంతకల్, అనంతపురం
శిక్ష:
POCSO చట్టం సెక్షన్ 5(j)(ii)(l) r/w 6 ప్రకారం,
సహజ మరణం వరకు కఠిన కారాగార జీవిత ఖైదు
జరిమానా: ₹10,000/-
(చెల్లించకపోతే అదనంగా 6 నెలల సాధారణ జైలు శిక్ష)
పరిహారం:
బాధితురాలికి ₹10,00,000/- చెల్లించాలని కోర్టు ఆదేశం
ఈ కేసులో నిందితుడికి శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించిన అధికారులను ఎస్.ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి అభినందించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >