Posted on 2026-04-13 17:33:33
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మండలం మరియు జిల్లా కేంద్రంలో చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయాలని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి లో వినతి పత్రం అందజేయడం జరిగింది. దుర్గా ప్రసాద్ నాయక్ మాట్లాడుతూ ఇప్పటికే వేసవి కాలం ప్రారంభమైనప్పటికీ చలివేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా కొత్త చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఉన్నా కేంద్రంలలో జిల్లా అధికారులు చర్యలు తీసుకొని వేసవికాలం దృష్ట్యా నీటి సరఫరా, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్, మజ్జిగ ప్యాకెట్లు, హెల్త్ క్యాంపులు పరిశుభ్రత విద్యుత్ సౌకర్యం వంటి సమస్యలు లేకుండా ఉండాలని ఆయన అన్నారు. బిజీగా ఉండే ప్రాంతాలు ట్రాఫిక్ సిగ్నల్స్, బస్టాండ్లు రైల్వేటేషన్లు, మార్కెట్ ప్రాంతాలు ఉండేచోట్ల తక్షణమే చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >