Posted on 2026-04-09 12:28:28
డైలీ భారత్, కామారెడ్డి:పట్టణానికి చెందిన ప్రముఖ శిశు వైద్య నిపుణుడు, జనని హాస్పిటల్లో సీనియర్ పీడియాట్రిషన్గా సేవలందిస్తున్న డాక్టర్ ఈ. అరవింద్ కుమార్ గౌడ్ ని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) లోని కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ (CPD) కమిటీకి కో-ఆప్టెడ్ సభ్యునిగా నియమించారు.
నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్రంలో వైద్యులు తమ జ్ఞానాన్ని నిరంతరం నవీకరించుకోవడం తప్పనిసరి. ఈ క్రమంలో ప్రతి వైద్యుడు ప్రతి సంవత్సరం 5 క్రెడిట్ పాయింట్లు (సుమారు 40 గంటలు) కలిగిన CPD కార్యక్రమాలలో పాల్గొనాల్సి ఉంటుంది.
CPD కమిటీ ద్వారా ప్రొఫెషనల్ సంస్థలు, బోధనా సంస్థలకు అక్రెడిటేషన్ ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమాల ద్వారా వైద్యులు తాజా వైద్య పరిజ్ఞానం, ఆవిష్కరణలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మెడికో-లీగల్ అంశాలపై అవగాహన పెంపొందించడంపై కూడా కమిటీ దృష్టి సారిస్తోంది.
డాక్టర్ అరవింద్ కుమార్ గౌడ్ నియామకంపై వైద్య వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >