Posted on 2026-04-07 17:50:46
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది. ఇప్పటికే పలువురు అధికారులు అవినీతి నిరోధక శాఖ ట్రాప్లలో చిక్కుకుని జైలుపాలైన ఘటనలు జరుగుతూనే ఉన్నప్పటికీ, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం లంచాల డిమాండ్ను ఆపడం లేదు. పని జరగాలంటే తప్పనిసరిగా లంచం ఇవ్వాలని బాధితులపై ఒత్తిడి తెస్తూ, ఇవ్వకపోతే ఫైళ్లు కదలవని స్పష్టంగా చెప్పే పరిస్థితి కొనసాగుతోంది. ఇలాంటి అవినీతి పరులపై తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో కఠిన చర్యలు తీసుకుంటోంది.
తాజాగా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం. గోవర్ధన్ ఏసీబీ ట్రాప్లో చిక్కి అరెస్టయ్యారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్ ప్రాంతంలో విత్తన లైసెన్స్ మంజూరు చేయాలని ఓ బాధితుడు అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం. గోవర్ధన్ వద్దకు వచ్చాడు. లక్షన్నర రూపాయలు లంచంగా ఇస్తే కానీ పని జరగదని గోవర్ధన్ నిక్కచ్చిగా చెప్పాడు. అందుకు బాధితుడు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే భాగంగా ముందుగా రూ.25 వేల లంచం ఇచ్చాడు. ఇంకా లక్ష రూపాయలు ఇచ్చేముందు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ సిటీ రేంజ్–II యూనిట్ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఈరోజు బాధితుడు దగ్గర్నుండి రూ.1 లక్ష లంచం తీసుకుంటుండ గా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. . ట్రాప్ అనంతరం నిర్వహించిన రసాయన పరీక్షలో డాక్టర్ గోవర్ధన్ చేతివేళ్లు పాజిటివ్గా తేలినట్లు అధికా రులు వెల్లడించారు. అరెస్టు చేసిన అనంతరం నిందితుడిని నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో ఎక్కడైనా అవినీతి ఎదురైతే ప్రజలు వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు
ఐవిఎఫ్ ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోకాల పఠనంలో బంగారు పతకాలు సాధించిన వారికి సన్మానం
Posted On 2026-04-07 12:50:09
Readmore >
హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-04-07 12:48:44
Readmore >
కామారెడ్డి లో జరుగుతున్న KPL వేదికగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-04-07 12:45:48
Readmore >
ప్రతినెలా 100కు పైగా ఫోన్ల రికవరీ... ఈ ఏడాది ఇప్పటివరకు ₹61 లక్షల విలువైన 384 ఫోన్లు స్వాధీనం
Posted On 2026-04-07 12:44:16
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో కొత్త కో ఆప్షన్. జూపల్లి రమేష్ అనుచరుడు ఎండి గౌస్ డా.దక్కే అవకాశం
Posted On 2026-04-07 12:36:49
Readmore >
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు, పోషక ఆహారం అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-07 11:09:21
Readmore >
అశ్వాపురం మండలంలోని గుత్తి కోయ గ్రామమైన గుండ్లమడుగు గ్రామోత్సవ సమావేశం
Posted On 2026-04-07 10:52:38
Readmore >
గురుకులాల్లో 48 సీట్లు సాధించిన సాయి ఎక్సలెంట్ విద్యార్థులు
Posted On 2026-04-07 10:51:04
Readmore >