Posted on 2026-04-03 10:06:21
డైలీ భారత్, రామంతాపూర్ / ఉప్పల్ :వెంకట సాయి నగర్ కాలనీలో కొంతకాలంగా ఇంటి వ్యర్థాలు, చెత్త రోడ్డుపై పడేయడం వల్ల రహదారులపై వాహనాలు జారిపడే ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను కాలనీ ప్రజలు కాలనీ అధ్యక్షుడు ఏ. విజయేందర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో ఏ. విజయేందర్ రెడ్డి తన కమిటీ సభ్యులతో కలిసి సమస్య ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన శానిటేషన్ విభాగం సిబ్బంది రోడ్లను ఊడ్చి శుభ్రపరిచి, కాలనీ ప్రజలకు ఉపశమనం కలిగించారు.
ఈ సందర్భంగా స్పందించి పని చేసిన శానిటేషన్ డీఈ, ఏఈ, సూపర్వైజర్, జవాన్లు, శానిటేషన్ కార్మికులకు కాలనీ అధ్యక్షుడు ఏ. విజయేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా కాలనీ పరిశుభ్రతకు సహకరించిన అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు.
అలాగే కాలనీ ప్రజలు కూడా ఇంటి చెత్త, వ్యర్థాలను రోడ్లపై వేయకుండా పరిశుభ్రతను పాటించి కాలనీని శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >
మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-30 22:23:35
Readmore >
నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-05-30 17:55:56
Readmore >
మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం
Posted On 2026-05-30 17:52:53
Readmore >
పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం
Posted On 2026-05-30 17:17:48
Readmore >
మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-05-30 17:15:14
Readmore >