| Daily భారత్
Logo




స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు

News

Posted on 2026-04-02 14:57:47

Share: Share


స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు

కల్తీ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి

నగర సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరిక

ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లతో సమావేశం

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, స్వలాభం కోసం కల్తీకి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ హెచ్చరించారు. కల్తీ అనేది కేవలం వ్యాపారం కాదని, అది సమాజంపై జరుగుతున్న దాడి అని ఆయన అన్నారు. 

గురువారం బషీర్‌బాగ్‌లోని పాత పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో "హెచ్‌-ఫాస్ట్‌" ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి మాంసం, పాలు, బేకరీ ఉత్పత్తులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ పొడి తదితర విభాగాలకు చెందిన సుమారు 200 మంది వ్యాపార ప్రతినిధులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, గత నెల రోజుల వ్యవధిలోనే నగరవ్యాప్తంగా 92 కేసులు నమోదు చేసి, సుమారు 62 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ అక్రమాలకు పాల్పడుతున్న 98 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. 

ఆహార పదార్థాల నాణ్యత విషయంలో రాజీ పడకుండా, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యాపారులు వ్యవహరించాలని హితవు పలికారు. కల్తీ రహిత తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని,  ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

హైదరాబాద్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖ్యాతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి వ్యాపారిపై ఉందని అన్నారు. ప్రతి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ కలిగి ఉండాలని, ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే తక్షణమే పోలీసులకు తెలపాలని కోరారు. 

నిజాయితీగా వ్యాపారం నిర్వహించే వారికి పోలీసు శాఖ, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఆరోగ్యవంతమైన హైదరాబాద్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. 

వ్యాపార ప్రతినిధులు క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను సీపీ దృష్టికి తీసుకురాగా, వాటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పోలీసుల చొరవను వ్యాపారులు అభినందిస్తూ, కల్తీని అరికట్టడంలో తమ వంతు సహకారాన్ని అందిస్తామని వారు చెప్పారు. 


Image 1

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానించిన మాజీ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గుప్తా

Posted On 2026-04-02 16:04:30

Readmore >
Image 1

స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు

Posted On 2026-04-02 14:57:47

Readmore >
Image 1

గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష ... చోడవరం కోర్టు సంచలన తీర్పు

Posted On 2026-04-02 14:47:44

Readmore >
Image 1

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ : డిసిపి శ్రీ ఎస్. శ్రీనివాస్, ఐపీఎస్

Posted On 2026-04-02 14:43:45

Readmore >
Image 1

హనుమాన్ ర్యాలీ సందర్భంగా మజ్జిగ పంపిణీ

Posted On 2026-04-02 13:46:06

Readmore >
Image 1

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం ఆవేదన

Posted On 2026-04-02 13:44:47

Readmore >
Image 1

వేములవాడ తిప్పాపురం గోశాలలో ఆకస్మిక తనిఖీలు

Posted On 2026-04-02 13:39:34

Readmore >
Image 1

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా అమరవాది

Posted On 2026-04-02 12:04:26

Readmore >
Image 1

రోడ్డు ప్రమాద బాదితులను కాపాడితే రహ్ వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం : జిల్లా ఎస్పీ

Posted On 2026-04-02 11:35:51

Readmore >
Image 1

జంగంపల్లి గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా గ్రామసభ

Posted On 2026-04-02 11:29:23

Readmore >