Posted on 2026-04-02 13:44:47
టవర్ ఎక్కిన వ్యక్తి ఘటన రాజంపేటలో ఉద్రిక్తత
ఇల్లు కేటాయించలేదని ఆత్మహత్యాయత్నం చేసిన హైమద్..
అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులు:
తహసీల్దార్ ముందు కాళ్లు మొక్కిన ఘటన కలకలం..?
పారదర్శకత కోరుతూ అధికారులపై స్థానికుల ఆగ్రహం..?
డైలీ భారత్, రాజంపేట: రాజంపేట మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో తనకు ఇల్లు కేటాయించలేదన్న ఆవేదనతో హైమద్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. పలుమార్లు అధికారులను సంప్రదించినప్పటికీ సరైన స్పందన రాలేదని ఆయన ఆరోపించారు. తన సమస్యను తెలియజేయడానికి పత్రికా విలేకరుల సమావేశానికి వెళ్లగా పోలీసులు అడ్డుకోవడంతో మరింత నిరాశకు గురైనట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో తీవ్ర ఆవేశానికి లోనైన హైమద్ టవర్పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడం పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని చాకచక్యంగా వ్యవహరించి అతనిని కిందికి దించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
అయితే తరువాత కూడా తన సమస్య పరిష్కారం కాలేదని భావించిన హైమద్, ప్రధాన కార్యాలయం వద్ద తహసీల్దార్ జానకి వద్దకు వెళ్లి కాళ్లు మొక్కి తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన అక్కడ ఉన్న వారిని కలచివేసింది. ప్రజల సమస్యలు వినిపించుకునే పరిస్థితి లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు విమర్శించారు.
గ్రామస్థులు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో పారదర్శకత ఉండాలని, అర్హులైన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఆవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటన రాజంపేటలో చర్చనీయాంశంగా మారగా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని రాజంపేట మండల ప్రజా రాజ్యాధికార పార్టీ మండల అధ్యక్షుడు అనిల్ పటేల్ మాట్లాడుతూ తాసిల్దార్ తప్పులు వల్ల అమాయకులు బలి అవుతున్నారు కావున తాసిల్దార్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఒక అధికారి అయ్యి కాళ్లు మొక్కు పెంచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ఈ సందర్భంగా రామన్న రెండు రోజుల్లో రాజాధికార పార్టీ వ్యవస్థాపకులు వద్దకు ఈ విషయాన్ని చేరవేస్తానని బాధితులకు పత్రిక ముఖంగా ఆయన తెలిపారు అలాగే తాసిల్దార్ ను సస్పెండ్ చేస్తూ ఆర్డిఓ కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు..
గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష ... చోడవరం కోర్టు సంచలన తీర్పు
Posted On 2026-04-02 14:47:44
Readmore >
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ : డిసిపి శ్రీ ఎస్. శ్రీనివాస్, ఐపీఎస్
Posted On 2026-04-02 14:43:45
Readmore >
రోడ్డు ప్రమాద బాదితులను కాపాడితే రహ్ వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం : జిల్లా ఎస్పీ
Posted On 2026-04-02 11:35:51
Readmore >
నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి 9 లక్షలకు పైగా బ్యాంకు రుణాలు పొందిన ముగ్గురు అరెస్ట్ : కల్లూరు ఏసీపీ
Posted On 2026-04-02 07:41:02
Readmore >