Posted on 2026-04-02 12:04:26
శుభాకాంక్షలు తెలియజేసిన పెండ్యాల విజయభాస్కర్
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా అమరవాది లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు కోర్టు ఆదేశాలతో సిటీ సివిల్ కోర్టులో ఓట్లను లెక్కించగా అమరవాది లక్ష్మీనారాయణ ఆరు ఓట్లుతో గెలుపొందారు ఈ సందర్భంగా హైదరాబాద్ చింతల్ బస్తీలోని ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు పెండ్యాల విజయభాస్కర్ అమరవాది లక్ష్మీనారాయణ కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. గడచిన 12 సంవత్సరాల కాలంలో అమరవాది తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఆర్యవైశ్యుల సంక్షేమం కొరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవైశ్యులందరినీ కలుపుకొని పోయి అందరికీ అభివృద్ధి ఫలాలు అందే విధంగా కృషి చేయాలని కోరారు ఆయనకు ఆర్యవైశ్యుల కుల దైవం అమ్మ వాసవి మాత సేవ చేసే శక్తి ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన ఆర్యవైశ్య ప్రతినిధులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాద బాదితులను కాపాడితే రహ్ వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం : జిల్లా ఎస్పీ
Posted On 2026-04-02 11:35:51
Readmore >
నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి 9 లక్షలకు పైగా బ్యాంకు రుణాలు పొందిన ముగ్గురు అరెస్ట్ : కల్లూరు ఏసీపీ
Posted On 2026-04-02 07:41:02
Readmore >
జడల చింత గ్రామంలో శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మి ప్రతిష్ట మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆలయ ధర్మకర్త కలసాని దుర్గ ప్రవీణ్
Posted On 2026-04-02 07:30:03
Readmore >
జాతీయ ఈ.ఎం.టీ. డే (ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్) దినోత్సవం
Posted On 2026-04-02 06:52:45
Readmore >