Posted on 2026-03-30 12:31:46
డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట: విద్యార్థులకు మెనూ కచ్చితంగా పాటిస్తూ నాణ్యమైన భోజనం ఇవ్వాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) విద్యాలయంలో కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, స్టోర్ రూమ్ లో ఆహార సామగ్రి, కోడి గుడ్లు, కూరగాయలు, విద్యార్థుల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలు, తరగతి, వసతి గదులను పరిశీలించారు. మెనూ ప్రకారం చికెన్, మటన్, కోడి గుడ్లు ఇస్తున్నారా అని ఆరా తీశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవు తుండగా, కలెక్టర్ వారితో మాట్లాడి.. పలు సూచనలు చేశారు.
విద్యార్థులందరూ చదువు పై శ్రద్ధ పెట్టాలని, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. తాము అనుకున్న ఉద్యోగాలు, ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.
#Sircillacollector #garimaagrawal #rajannasircilla #sircilla_rajanna_district
గంజాయి కేసులలో నిందితుడిపై పీడీయాక్ట్ నమోదు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-03-30 16:36:48
Readmore >
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం : కామారెడ్డిలో "అరైవ్ అలైవ్-2026" అవగాహన కార్యక్రమం
Posted On 2026-03-30 15:58:17
Readmore >
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం : కామారెడ్డిలో "అరైవ్ అలైవ్-2026" అవగాహన కార్యక్రమం
Posted On 2026-03-30 15:58:17
Readmore >
ఆర్టిజన్ మరియు ఆన్ మ్యాండ్ కార్మికులు సమస్యలు పరిష్కరించండి
Posted On 2026-03-30 14:59:22
Readmore >
విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు.. కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-30 12:51:22
Readmore >
గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 36 ఫిర్యాదులు స్వీకరణ : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-30 12:33:26
Readmore >
ఎల్లారెడ్డిపేట దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఆకస్మిక తనిఖీ చేసిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-30 12:31:46
Readmore >