Posted on 2026-03-30 12:03:00
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టడంపై తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు గోకుల్ రామారావు హర్షం వ్యక్తం చేశారు.సోమవారం రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణంలో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా న్యాయవాదులపై వివిధ రకాల దాడులు, హత్యలు, హత్యాయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు తమకు రక్షణ చట్టం కావాలని నిరంతరం పోరాటం కొనసాగించారని పేర్కొన్నారు.
న్యాయవాదుల రక్షణ చట్ట అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం, ఈరోజు అసెంబ్లీలో ఆ చట్టాన్ని ప్రవేశపెట్టడం ఆనందకరమైన విషయం అని ఆయన అభిప్రాయపడ్డారు.రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు విప్లవ రెడ్డి మాట్లాడుతూ, న్యాయవాదుల దీర్ఘకాలిక డిమాండ్ను నెరవేర్చుతూ ప్రభుత్వం ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకురావడం హర్షణీయమని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నూతన ప్రధాన కార్యదర్శి వోద్యారపు రవికుమార్, ఉపాధ్యక్షుడు బొడ్డు రమేష్ కుమార్,స్రవంతి,వోద్యారపుస్వప్న, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
గంజాయి కేసులలో నిందితుడిపై పీడీయాక్ట్ నమోదు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-03-30 16:36:48
Readmore >
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం : కామారెడ్డిలో "అరైవ్ అలైవ్-2026" అవగాహన కార్యక్రమం
Posted On 2026-03-30 15:58:17
Readmore >
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం : కామారెడ్డిలో "అరైవ్ అలైవ్-2026" అవగాహన కార్యక్రమం
Posted On 2026-03-30 15:58:17
Readmore >
ఆర్టిజన్ మరియు ఆన్ మ్యాండ్ కార్మికులు సమస్యలు పరిష్కరించండి
Posted On 2026-03-30 14:59:22
Readmore >
విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు.. కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-30 12:51:22
Readmore >
గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 36 ఫిర్యాదులు స్వీకరణ : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-30 12:33:26
Readmore >
ఎల్లారెడ్డిపేట దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఆకస్మిక తనిఖీ చేసిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-30 12:31:46
Readmore >