Posted on 2026-03-30 14:03:00
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టడంపై తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు గోకుల్ రామారావు హర్షం వ్యక్తం చేశారు.సోమవారం రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణంలో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా న్యాయవాదులపై వివిధ రకాల దాడులు, హత్యలు, హత్యాయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు తమకు రక్షణ చట్టం కావాలని నిరంతరం పోరాటం కొనసాగించారని పేర్కొన్నారు.
న్యాయవాదుల రక్షణ చట్ట అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం, ఈరోజు అసెంబ్లీలో ఆ చట్టాన్ని ప్రవేశపెట్టడం ఆనందకరమైన విషయం అని ఆయన అభిప్రాయపడ్డారు.రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు విప్లవ రెడ్డి మాట్లాడుతూ, న్యాయవాదుల దీర్ఘకాలిక డిమాండ్ను నెరవేర్చుతూ ప్రభుత్వం ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకురావడం హర్షణీయమని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నూతన ప్రధాన కార్యదర్శి వోద్యారపు రవికుమార్, ఉపాధ్యక్షుడు బొడ్డు రమేష్ కుమార్,స్రవంతి,వోద్యారపుస్వప్న, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >