| Daily భారత్
Logo




ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

News

Posted on 2026-03-29 13:28:07

Share: Share


ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో పట్టణంలో  స్వీట్ పంపిణి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఇల్లందు నియోజకవర్గ కన్వీన ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం కు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు 

అనంతరం కేకు కట్ చేసి కేక్ మరియు స్వీట్లు పంపిణీ చేశారు 

ఈ కార్యకమానికి విచెసిన పార్టీ సీనియర్ నాయకులను శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు 

ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ ఇల్లందు నియోజకవర్గ కన్వీనర్ ముద్రగడ వంశీ, సర్పంచ్  చాందావత్ రమేష్ బాబు,TNSF పట్టణ అధ్యక్షులు దాసరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..

 బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధిని చేయడం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆనాడు పేదవాడి ఆకలి తీర్చడానికి అన్న ఎన్ టి రామారావు  తీసుకున్న నిర్ణయమే తెలుగుదేశం పార్టీ అని రెండు రూపాయలకే కిలో బియ్యం,50 రూపాయలకే హార్స్ పవర్,కూడు గుడ్డ నినాదంతో, పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేస్తూ మహిళలకు ఆస్తిలో హక్కును కల్పిస్తూ ఇలా ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం

బీసీలకు రాజ్యాధికారం ఇచ్చి రాజకీయంగా ముందుకు నడిపించింది తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి సారి పార్లమెంట్ లో దళితుడిని స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రెవెన్యూ అందిస్తున్న హైదరాబాదును తీర్చిదిద్దింది  తెలుగుదేశం పార్టీ, ఇలా ఎన్టీఆర్,చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అనేక సంక్షేమ ఫలాలను అందించింది తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా ఉన్న ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలో ఓనమాలు నేర్చుకొని వెళ్లిన వారేనని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా  పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీ విని ఎరగని మెజార్టీని ప్రజలు అందించారని 

 రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా బలమైన శక్తిగా ఎదుగుతుందని వారు ఆశ భావం  వ్యక్తం చేశారు 

 ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ మనుబోతుల అఖిల్,సీనియర్ నాయకులు శ్యామ్ తీవరి, కారు నరసన్న,మైపా బాలరాజు, చెలిమల బాబు, నున్నా రామకృష్ణ,కందిరవి,దగ్గుల లింగయ్య,గోగేలా రాజేష్,ముక్కు శ్రీవెద్, దేవరకొండ నవీన్, కామ ప్రణయ్,రాజ్ కుమార్,సన్నీ, వినయ్, తదితరులు పాల్గొన్నారు

Image 1

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదు

Posted On 2026-05-31 19:27:27

Readmore >
Image 1

పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo

Posted On 2026-05-31 19:24:06

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్

Posted On 2026-05-31 19:22:44

Readmore >
Image 1

ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు

Posted On 2026-05-31 18:45:35

Readmore >
Image 1

హెల్త్ కార్డుల కోసం జీతంలో కోత విధించడం సరికాదు

Posted On 2026-05-31 18:02:37

Readmore >
Image 1

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Posted On 2026-05-31 18:00:17

Readmore >
Image 1

ఏసీబీ వలకు చిక్కిన సర్వ శిక్ష అభియాన్ ఏఈ

Posted On 2026-05-31 14:02:34

Readmore >
Image 1

బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయిన చంద్రంపేట విద్యార్థులు

Posted On 2026-05-31 13:53:49

Readmore >
Image 1

"క్షణిక ఆనందం - జీవితకాల నష్టం"

Posted On 2026-05-31 11:23:19

Readmore >
Image 1

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు

Posted On 2026-05-30 22:26:06

Readmore >