| Daily భారత్
Logo




సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

News

Posted on 2026-03-25 19:40:49

Share: Share


సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

ధర్మారం సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల(బీఆర్సీ) తయారీ కేంద్రం ప్రారంభం.

డైలీ భారత్, కోనరావుపేట: రైతులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కోనరావుపేట మండలం ధర్మారంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల తయారీ కేంద్రంలో బుధవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సేంద్రియ ఉత్పత్తుల తయారీ కేంద్రంలో కషాయాలు, సేంద్రియ ఎరువు అలాగే తయారీ విధానం పశువుల పెంపకం ఇతర అంశాలను కలెక్టర్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు రైతులకు మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపారు. జిల్లాకు 9 బయో ఇన్ ఫుట్ రిసోర్స్ సెంటర్(బీఆర్సీ)సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు తయారీ కేంద్రాలు) మంజూరు చేసిందని వెల్లడించారు. ఒక్కో కేంద్రానికి లక్ష రూపాయలు అందజేసిందని తెలిపారు. ఆయా కేంద్రాల్లో సేంద్రియ ఎరువులు, కషాయాలు ఆవు పేడ ఇతర పదార్థాలతో సిద్ధం చేసిన వాటిని రైతులు సాగులో వినియోగించుకునేందుకు తోడ్పాటు అందించేందుకు ఈ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు  రైతులు తమ పరిధిలోని సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తి తయారీ కేంద్రాలు సందర్శించి సాగులో ఆయా ఉత్పత్తులను వినియోగించాలని సూచించారు. రైతులకు వ్యవసాయ శాఖ ఆర్థికంగా భరోసా ఇస్తుందని తెలిపారు. దీంతో నేలకు పర్యావరణానికి ఎంతో మేలు అని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >