| Daily భారత్
Logo




సమన్వయంతో డ్రగ్స్ నియంత్రించాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

News

Posted on 2026-03-25 19:37:36

Share: Share


సమన్వయంతో డ్రగ్స్ నియంత్రించాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

మానసిక సమస్యలు ఉన్న వారికి 14416 ద్వారా టెలీ మానస్ 24*7 అందుబాటులో

మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించిన కలెక్టర్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో డ్రగ్స్ ను నియంత్రించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై బుధవారం కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్ డీపీఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు.. డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కోటిక్  సమావేశంలో పాల్గొనే ప్రతి శాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించుకొని అమలు చేయాలని  సూచించారు. 14416 ఆన్లైన్ ద్వారా 24*7 టెలీ మానస్ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. మానసికంగా ఇబ్బంది పడే వారికి ఫోన్ ద్వారా కౌన్సెలింగ్ ఇస్తారని తెలిపారు. డ్రగ్స్, మాదకద్రవ్యాలతో కలిగే నష్టాలపై పోలీస్, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో  సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ షాప్ లలో తనిఖీ చేయాలని సూచించారు.

మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సిలింగ్ అందించాలని, డీ అడిక్షన్ సెంటర్ లో  చికిత్స అందించాలని కలెక్టర్ సూచించారు. అటవీ శాఖ అధికారులు వారి పరిధిలోని అటవీ భూములు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని డ్రగ్ ఇన్స్ పెక్టర్ కు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ శాఖ అధికారి శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ రజిత, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, డీఐఈఓ శరత్ కుమార్, డీఈఓ జగన్ మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, వ్యవసాయ, డ్రగ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >