Posted on 2026-03-19 06:20:00
కలెక్టర్ సమక్షంలో టెండర్లు తీయాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం కొత్తగూడెం సుజాతనగర్ పాల్వంచ వేరువేరు సెక్టార్లుగా చూడకుండా ఒకే టెండర్ విధానాన్ని పాటించాలి
జలాల్ ఆవాజ్ పట్టణ కార్యదర్శి
సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ కన్వీనర్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో పట్టణ పరిధిలోని పలు రకాల టెండర్ల విషయంలో గందరగోళం నెలకొనడానికి గల కారణం ఎవరో అని ఆవాజ్ పట్టణ కార్యదర్శి సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ కన్వీనర్ జలాల్ ప్రశ్నించారు. కార్పొరేషన్ హోదా వచ్చినప్పటికీ యావత్ 60 డివిజన్లకు సంబంధించిన ఎలాంటి పనులైన టెండర్ ఒకటే వేయడం వల్ల కార్పొరేషన్ కి లాభం వస్తుందని కానీ కొత్తగూడెం వేరు పాల్వంచ వేరు సుజాతనగర్ వేరు సెక్టార్లుగా చూస్తూ టెండర్లు పిలవడం భవిష్యత్తుకు నష్ట ధారయకమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా జరుగుతున్న గందరగోళ పరిస్థితుల్లో ప్రస్తుతం సంత, డైలీ మార్కెట్, కబేలా టెండర్లలో కూడా జరుగుతుండడం బాధాకరమని ఆయన తెలిపారు. టెండర్లు పిలిచిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులు ఎందుకు వ్యవహరించారో ఎందుకు గందరగోళ్లపడి తలబడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన ఆరోపించారు. టెండర్లు కొంతమందికి కేటాయించి మరల ఘర్షణ తర్వాత టెండర్లు రద్దయ్యాయి అధికారం మాకు ఉంది అంటూ అధికారులు చెబుతుండడం ఏంటని ఆయన ప్రశ్నించారు. టెండర్లు ఎవరేసినా మాకు అభ్యంతరం లేదని అధికారులు పాలకవర్గం నిబంధనలు పాటించి కార్పొరేషన్ కు నష్టం రాకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జరుగుతున్న టెండర్ ప్రక్రియలో కలెక్టర్ సమక్షంలో టెండర్లు వచ్చినవారికి కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ కి టెండర్ల విషయంలో అభివృద్ధి విషయంలో ఎలాంటి నష్టం వచ్చిన కచ్చితంగా పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు
పాల్వంచ లో ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర(బజరంగ్దళ్ బైక్ ర్యాలీ)
Posted On 2026-04-03 06:40:29
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో రోడ్లు శుభ్రపరిచిన శానిటేషన్ సిబ్బందికి కృతజ్ఞతలు
Posted On 2026-04-03 04:36:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వరకట్నం హత్య కేసులో భర్తతో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు
Posted On 2026-04-03 03:53:18
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : ముగ్గురు అంతర్ జిల్లా దొంగలు అరెస్టు, రిమాండ్ తరలింపు
Posted On 2026-04-03 03:51:24
Readmore >
హెచ్ పీ గ్యాస్ బాధితులా నిరసనలు తహసీల్దార్ కీ పిర్యాదులు...
Posted On 2026-04-03 03:27:41
Readmore >
దేశ వ్యాపంగా సంచలనం సృష్టించిన సైబర్ క్రైమ్ కేస్ లో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులను అరెస్టు చేసిన సత్తుపల్లి పోలీసులు
Posted On 2026-04-03 03:25:40
Readmore >
భద్రాచలం పాదయాత్రకు తరలి వెళ్లిన తల్లాడ మండలం నారాయణపురం భక్తులు
Posted On 2026-04-03 03:24:24
Readmore >