| Daily భారత్
Logo




కార్పొరేషన్ టెండర్ల గందరగోళానికి కారణం ఎవరు

News

Posted on 2026-03-19 07:20:00

Share: Share


కార్పొరేషన్ టెండర్ల గందరగోళానికి కారణం ఎవరు

 కలెక్టర్ సమక్షంలో టెండర్లు తీయాలి 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం కొత్తగూడెం సుజాతనగర్ పాల్వంచ వేరువేరు సెక్టార్లుగా చూడకుండా ఒకే టెండర్ విధానాన్ని పాటించాలి  

జలాల్ ఆవాజ్ పట్టణ కార్యదర్శి 

సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ కన్వీనర్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో పట్టణ పరిధిలోని పలు రకాల టెండర్ల విషయంలో గందరగోళం నెలకొనడానికి గల కారణం ఎవరో అని ఆవాజ్ పట్టణ కార్యదర్శి సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ కన్వీనర్ జలాల్ ప్రశ్నించారు. కార్పొరేషన్ హోదా వచ్చినప్పటికీ యావత్ 60 డివిజన్లకు సంబంధించిన ఎలాంటి పనులైన టెండర్ ఒకటే వేయడం వల్ల కార్పొరేషన్ కి లాభం వస్తుందని కానీ కొత్తగూడెం వేరు పాల్వంచ వేరు సుజాతనగర్ వేరు సెక్టార్లుగా చూస్తూ టెండర్లు పిలవడం భవిష్యత్తుకు నష్ట ధారయకమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా జరుగుతున్న గందరగోళ పరిస్థితుల్లో ప్రస్తుతం సంత, డైలీ మార్కెట్, కబేలా టెండర్లలో కూడా జరుగుతుండడం బాధాకరమని ఆయన తెలిపారు. టెండర్లు పిలిచిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులు ఎందుకు వ్యవహరించారో ఎందుకు గందరగోళ్లపడి తలబడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన ఆరోపించారు. టెండర్లు కొంతమందికి కేటాయించి మరల ఘర్షణ తర్వాత టెండర్లు రద్దయ్యాయి అధికారం మాకు ఉంది అంటూ అధికారులు చెబుతుండడం ఏంటని ఆయన ప్రశ్నించారు. టెండర్లు ఎవరేసినా మాకు అభ్యంతరం లేదని అధికారులు పాలకవర్గం నిబంధనలు పాటించి కార్పొరేషన్ కు నష్టం రాకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జరుగుతున్న టెండర్ ప్రక్రియలో కలెక్టర్ సమక్షంలో టెండర్లు వచ్చినవారికి కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ కి టెండర్ల విషయంలో అభివృద్ధి విషయంలో ఎలాంటి నష్టం వచ్చిన కచ్చితంగా పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు

Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >
Image 1

కామారెడ్డిలో రైస్ మిల్లర్ల మహా ధర్నా విజయవంతం...

Posted On 2026-09-10 15:19:28

Readmore >
Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >