Posted on 2026-03-19 11:50:00
కలెక్టర్ సమక్షంలో టెండర్లు తీయాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం కొత్తగూడెం సుజాతనగర్ పాల్వంచ వేరువేరు సెక్టార్లుగా చూడకుండా ఒకే టెండర్ విధానాన్ని పాటించాలి
జలాల్ ఆవాజ్ పట్టణ కార్యదర్శి
సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ కన్వీనర్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో పట్టణ పరిధిలోని పలు రకాల టెండర్ల విషయంలో గందరగోళం నెలకొనడానికి గల కారణం ఎవరో అని ఆవాజ్ పట్టణ కార్యదర్శి సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ కన్వీనర్ జలాల్ ప్రశ్నించారు. కార్పొరేషన్ హోదా వచ్చినప్పటికీ యావత్ 60 డివిజన్లకు సంబంధించిన ఎలాంటి పనులైన టెండర్ ఒకటే వేయడం వల్ల కార్పొరేషన్ కి లాభం వస్తుందని కానీ కొత్తగూడెం వేరు పాల్వంచ వేరు సుజాతనగర్ వేరు సెక్టార్లుగా చూస్తూ టెండర్లు పిలవడం భవిష్యత్తుకు నష్ట ధారయకమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా జరుగుతున్న గందరగోళ పరిస్థితుల్లో ప్రస్తుతం సంత, డైలీ మార్కెట్, కబేలా టెండర్లలో కూడా జరుగుతుండడం బాధాకరమని ఆయన తెలిపారు. టెండర్లు పిలిచిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులు ఎందుకు వ్యవహరించారో ఎందుకు గందరగోళ్లపడి తలబడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన ఆరోపించారు. టెండర్లు కొంతమందికి కేటాయించి మరల ఘర్షణ తర్వాత టెండర్లు రద్దయ్యాయి అధికారం మాకు ఉంది అంటూ అధికారులు చెబుతుండడం ఏంటని ఆయన ప్రశ్నించారు. టెండర్లు ఎవరేసినా మాకు అభ్యంతరం లేదని అధికారులు పాలకవర్గం నిబంధనలు పాటించి కార్పొరేషన్ కు నష్టం రాకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జరుగుతున్న టెండర్ ప్రక్రియలో కలెక్టర్ సమక్షంలో టెండర్లు వచ్చినవారికి కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ కి టెండర్ల విషయంలో అభివృద్ధి విషయంలో ఎలాంటి నష్టం వచ్చిన కచ్చితంగా పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >