Posted on 2026-03-12 18:47:14
డైలీ భారత్, కామారెడ్డి: ఈ నెల 14 వ తేదీ నుండి జరగనున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు.
పదవ తరగతి పరీక్షలు – విద్యార్థులు , అధికారులు కోసం సూచనలు
జిల్లా లో పదవ తరగతి పరీక్షలు ఈ సంవత్సరం 14.03.2026 నుండి 16.04.2026 వరకు మొత్తం 65 రెగ్యులర్ సెంటర్లలో జరుగనున్నాయి. మొత్తం 13,154 విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారు.
ప్రధాన సూచనలు:
పరీక్షా అధికారులు:
చీఫ్ సూపరింటెండెంట్ మరియు డిపార్టుమెంటల్ అధికారులు – 65
ఇన్విజిలేటర్లు – 739
పరీక్షా సమయం: ఉదయం 09:30 AM నుండి 12:30 PM వరకు.
విద్యార్థులు తమ కేటాయించిన కేంద్రానికి ఒక గంట ముందుగానే చేరాలి.
హాల్ టికెట్:
అధికారిక వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు: www.bse.telangana.gov.in�
పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్, రైటింగ్ ప్యాడ్, పెన్స్, పెన్సిల్స్ మాత్రమే తీసుకెళ్ళాలి.
నిషేధిత వస్తువులు:
సెల్ ఫోన్లు, పీజర్లు, క్యాల్క్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, పాఠ్యపుస్తకాలు, ప్రింటెడ్ మెటీరియల్స్, నకలులు నేరుగా కేంద్రానికి తీసుకురావడం అనుమతించబడదు.
పరీక్షా వ్యవహారం:
విద్యార్థులు పరీక్ష సమయంలో కేంద్రం నుంచి బయటకు వెళ్ళకూడదు, సమాధాన పత్రం పూర్తయినప్పటికీ, కేటాయించిన సమయం ముగిసే వరకు హాల్ లో ఉండాలి.
హాల్ టికెట్ లేదా OMR షీట్ లో ఏవైనా తప్పులు ఉంటే, ఇన్విజిలేటర్ లేదా చీఫ్ సూపరింటెండెంట్ కి వెంటనే తెలియచేయాలి.
కంట్రోల్ రూమ్:
24 గంటల పాటు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్ 9959670118 కు కాల్ చేసి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >