Posted on 2026-03-12 18:24:55
డైలీ భారత్, హైదరాబాద్: నేరేడ్మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనగర్కు చెందిన నగెల్లి శ్రీనివాస్(41) ఓ ప్రైవేట్ ఉద్యోగి. అతని స్వగ్రామం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్. శ్రీనివాస్ 2012లో జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. భార్ గ్రూప్స్ పరీక్షలకు ప్రీపేర్ అయ్యేందుకు భర్త శ్రీనివాస్ చాలా హెల్ప్ చేశాడు. భర్త సహాయంతో జ్యోతి గ్రూప్స్లో విజయం సాధించి ఎక్సైజ్ సీఐగా నియమితులయ్యింది. ఉద్యోగం వచ్చిన తర్వాత భర్తను దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. అంతే కాదు.. భర్తపై వరకట్నం వేధింపులు, విడాకుల కేసులు పెట్టింది. వేధింపులకు పాల్పడటంతో శ్రీనివాస్ తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురై నిన్న రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘భార్య వేధింపులు, కేసుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని సూసైడ్ నోట్ రాశాడు. శ్రీనివాస్ సోదరుడు శివకృష్ణ ఇంటికి వచ్చి చూడగా అతను మృతిచెందినట్లు గుర్తించాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోదరుడి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ భార్య జ్యోతి సహా మరో 10 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి : కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
Posted On 2026-03-12 18:49:30
Readmore >
కామారెడ్డి జిల్లా గురువారం పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-03-12 18:47:14
Readmore >
బిజెపి నుండి గెలిచిన 16 మంది కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ ల కు సన్మానం చేసిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతరాజు వెంకటేశ్ పెరిక
Posted On 2026-03-12 18:45:43
Readmore >
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ పైన అవగాహన కార్యక్రమము
Posted On 2026-03-12 17:34:10
Readmore >
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు శిక్షణ
Posted On 2026-03-12 17:29:36
Readmore >
లిమ్స్ హాస్పిటల్ ను ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
Posted On 2026-03-12 17:28:11
Readmore >
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రజలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీప్రభుత్వం
Posted On 2026-03-12 13:45:42
Readmore >