| Daily భారత్
Logo




మద్యం మత్తులో వాహనం నడిపితే… జైలు జీవితం తప్పదు!

News

Posted on 2026-03-09 19:08:37

Share: Share


మద్యం మత్తులో వాహనం నడిపితే… జైలు జీవితం తప్పదు!

ఒకే రోజు 86 మందికి కోర్టు శిక్షలు

08 మందికి ఒక రోజు జైలు శిక్ష, 01 వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష

మొత్తం ₹1,22,500/- భారీ జరిమానా విధింపు

 “మీ ప్రాణం – మీ కుటుంబానికి అమూల్యం… నిబంధనలు పాటించండి” – జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ 

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు కేవలం వాహనదారుడినే కాకుండా, రోడ్డు మీద ప్రయాణించే ఇతర అమాయకుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతున్నాయి.

ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో మద్యం మత్తులో వాహనం నడిపిన వ్యక్తులను పోలీసులు పట్టుకుని కోర్టు ముందు హాజరుపరిచారు. కేసుల తీవ్రతను పరిశీలించిన న్యాయమూర్తి మొత్తం 86 మందికి వివిధ రకాల శిక్షలు విధించారు. వీరిలో 08 మందికి ఒక రోజు జైలు శిక్ష, 01 వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధించగా, మిగతా వారికి కలిపి ₹1,22,500/- రూపాయల జరిమానా విధించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల ఒక కుటుంబం మాత్రమే కాకుండా అనేక కుటుంబాల జీవితాలు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. తాత్కాలిక ఆనందం కోసం చేసే తప్పిదం జీవితాంతం బాధకు కారణం కావొచ్చని హెచ్చరించారు.

ప్రజలందరూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమని, మీ భద్రతతో పాటు ఇతరుల భద్రత కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు.

Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >
Image 1

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-05-02 23:48:08

Readmore >
Image 1

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-02 23:19:44

Readmore >
Image 1

పత్రికా స్వేచ్ఛ… సమాజం ఊపిరి

Posted On 2026-05-02 22:28:56

Readmore >
Image 1

ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు

Posted On 2026-05-02 22:26:17

Readmore >
Image 1

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత

Posted On 2026-04-29 19:01:13

Readmore >