Posted on 2026-03-08 18:51:10
డైలీ భారత్, దమ్మన్నపేట్: అగస్థ్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మరియు కాగ్నిజెంట్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన “ఇన్నోవేషన్ ఎక్స్ప్రెస్” రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ZPHS దమ్మన్నపేట్ 8వ తరగతి విద్యార్థులు పొన్నాల లోహిత, కోల లాస్య ప్రియ లు, అద్భుత ప్రతిభ కనబరిచి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు.
ఈ కార్యక్రమం మార్చి 6, 7 తేదీలలో సికింద్రాబాద్లోని తెలంగాణ గార్డెన్ హాల్లో రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా 272 మంది విద్యార్థులు ఈ వైజ్ఞానిక ప్రదర్శన కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, అందులో నుంచి అత్యుత్తమ 65 ఆవిష్కరణలను ఎంపిక చేసి వారికి తుది పోటీని నిర్వహించారు.
ఈ పోటీలలో గైడ్ టీచర్ సంపత్ కుమార్ మార్గదర్శకత్వంలో పొన్నాల లోహిత, కోల లాస్యప్రియ విద్యార్థినులు రూపొందించిన “వంటమిత్ర” అనే వినూత్న ఆవిష్కరణతో అద్భుతమైన ప్రదర్శన చేసి మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. విజేతలకు 10 వేల నగదు తో పాటుగా, జ్ఞాపిక ము అగస్థ్య ఫౌండేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బలరాం, మరియు నటేష్ అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి దేవయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయ బృందం మరియు గ్రామస్థులు విద్యార్థులను అభినందించారు.
ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం
Posted On 2026-06-05 18:30:49
Readmore >
మద్యపాన వ్యసనం నుండి కార్మికులు విముక్తి పొందాలి : ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్
Posted On 2026-06-05 17:23:03
Readmore >
డివైడర్ మధ్యలో మొక్కలు నాటాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-05 17:14:37
Readmore >
మహిళలు, చిన్నారులతో కలసి స్వయంగా విత్తన బంతులు తయారు చేసిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-05 14:40:07
Readmore >
భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డుపై పడిన చెట్టును తొలగించి రాకపోకలు పునరుద్ధరించిన బీబీపేట్ పోలీసులు
Posted On 2026-06-04 20:12:57
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభల్లో “Arrive Alive” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-04 20:11:41
Readmore >