Posted on 2026-03-02 19:50:39
కుంటబడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మానవ సమాజ నిర్మాణంలో జన్యుశాస్త్రం పాత్ర ప్రత్యేకమైనదని, ఈ విద్యార్థులు తెలుసుకోవడం ఎంతో అవసరమని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పద్మావతి కాలనీ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కోసం నూతనంగా ఏర్పాటుచేసిన సైన్స్ ల్యాబ్ ను షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్ ముదిరాజ్, స్థానిక కౌన్సిలర్ సి.పెంటయ్య, ఎంఈఓ మనోహర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాగ్యమ్మలతో కలసి ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్. అనంతరం విద్యార్థుల కోసం నూతనంగా ఏర్పాటు చేస్తున్న వాష్ రూం లను పరిశీలించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ప్రధానోపాధ్యాయురాలు భాగ్యమ్మ ఆధ్వర్యంలో పాఠశాల విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయని ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్,కౌన్సిలరు దిలీప్, మురళీ మోహన్ (అప్పి)సాధిక్, ముబారక్ అలీ ఖాన్, అనిల్,చందు,ఖదీర్ ప్రదీప్ ముదిరాజ్, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
Posted On 2026-06-02 10:50:02
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >