Posted on 2026-03-02 19:50:39
కుంటబడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మానవ సమాజ నిర్మాణంలో జన్యుశాస్త్రం పాత్ర ప్రత్యేకమైనదని, ఈ విద్యార్థులు తెలుసుకోవడం ఎంతో అవసరమని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పద్మావతి కాలనీ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కోసం నూతనంగా ఏర్పాటుచేసిన సైన్స్ ల్యాబ్ ను షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్ ముదిరాజ్, స్థానిక కౌన్సిలర్ సి.పెంటయ్య, ఎంఈఓ మనోహర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాగ్యమ్మలతో కలసి ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్. అనంతరం విద్యార్థుల కోసం నూతనంగా ఏర్పాటు చేస్తున్న వాష్ రూం లను పరిశీలించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ప్రధానోపాధ్యాయురాలు భాగ్యమ్మ ఆధ్వర్యంలో పాఠశాల విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయని ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్,కౌన్సిలరు దిలీప్, మురళీ మోహన్ (అప్పి)సాధిక్, ముబారక్ అలీ ఖాన్, అనిల్,చందు,ఖదీర్ ప్రదీప్ ముదిరాజ్, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్పూర్కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >
మస్జీద్ కాంప్లెక్స్లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Posted On 2026-03-04 18:30:50
Readmore >
కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు
Posted On 2026-03-04 16:19:10
Readmore >
38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్కు డిమాండ్
Posted On 2026-03-04 16:16:19
Readmore >
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
Posted On 2026-03-04 15:50:03
Readmore >