Posted on 2026-03-02 11:37:28
ఉపాధ్యాయులే నా ఆశ, నా శ్వాస.....
పి ఆర్ టి యు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి.
డైలీ భారత్, కామారెడ్డి: ఆదివారం రోజు కామారెడ్డి లో పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర, జిల్లా బాద్యులతో సమావేశం అనంతరం విలేకరుల సమావేశం లో ప్రసంగించిన వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాషా పండితులకు, పిఈటిలకు, ఎస్జీటీలకు, స్కూల్ అసిస్టెంట్స్ కి పదోన్నతులు కల్పించడంలో పి ఆర్ టి యు తెలంగాణ కీలక పాత్ర పోషించిందని, రాబోయే రోజుల్లో కూడా ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ సమస్యలు అన్ని పరిష్కరించడానికి ముందుంటామని హామీ ఇవ్వడం జరిగింది.
1. సిపిఎస్ విధానం రద్దు పరిచి ఓ పి ఎస్ పునరుద్ధరించడం, 2003 డీఎస్సీ వారికి జీవో 57/4,57/5 అమలు పరచడం.
2. ఉమ్మడి సర్వీసు రూల్స్ సాధించడం
3. ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో పదోన్నతులు, బదిలీలు నిర్వహించడానికి కృషి చేయడం.
4. కేజీబీవీ లో పనిచేస్తున్న పిజిసిఆర్టి లకు, సిఆర్టి లకు మరియు ఎస్ఎస్ఎ లో పని అందరికీ "మినిమం టైం స్కేలు" ఇప్పించడం మరియు హెల్త్ కార్డులు ఇప్పించడానికి కృషి చేయడం.
5. మోడల్ స్కూల్ లో పనిచేస్తున్న మరియు గురుకులాల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించడం.
6 ఎయిడెడ్ స్కూల్స్ ని ప్రభుత్వ పాఠశాలలో విలీనం చేయడం
కామారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడం వారి హక్కుల సాధనలో కామారెడ్డి జిల్లా శాఖ క్రియాశీల పాత్ర పోషిస్తుందని, పదో తరగతి మూల్యాంకన కేంద్రం కామారెడ్డి జిల్లాకు కేటాయించడానికి పట్టు పట్టి సాధించారని జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు,ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మీరాజం ను అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆకునూరి మురళి సారథ్యంలోని విద్యా కమిషన్ ఉపాధ్యాయులకు వేతనాలు తగ్గించాలని చెప్పడం అవివేకమని, విద్యకు కేటాయించే నిధులు ఖర్చుగా చూడకూడదని పెట్టుబడిగా చూడాలి అని, ఉపాధ్యాయుల ద్వారా శిక్షణ పొందే విద్యార్థులు దేశానికి ఉత్తమ పౌరులుగా, అధికారులుగా నాయకులుగా ఎదుగుతారు అది పెట్టుబడికి ఫలితం గా మారుతుంది అని చెప్పారు.
ఈ సమావేశం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రత్నాకర్ రావు, కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ ఎన్. చంద్రశేఖర్ రావు, జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మీరాజం, అధ్యక్షులు ఓంప్రకాష్ , రాష్ట్ర, జిల్లా బాధ్యులు ఆనంద్, వెంకట్, మారుతి తదితరులు పాల్గొన్నారు
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >