Posted on 2026-03-02 16:07:28
ఉపాధ్యాయులే నా ఆశ, నా శ్వాస.....
పి ఆర్ టి యు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి.
డైలీ భారత్, కామారెడ్డి: ఆదివారం రోజు కామారెడ్డి లో పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర, జిల్లా బాద్యులతో సమావేశం అనంతరం విలేకరుల సమావేశం లో ప్రసంగించిన వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాషా పండితులకు, పిఈటిలకు, ఎస్జీటీలకు, స్కూల్ అసిస్టెంట్స్ కి పదోన్నతులు కల్పించడంలో పి ఆర్ టి యు తెలంగాణ కీలక పాత్ర పోషించిందని, రాబోయే రోజుల్లో కూడా ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ సమస్యలు అన్ని పరిష్కరించడానికి ముందుంటామని హామీ ఇవ్వడం జరిగింది.
1. సిపిఎస్ విధానం రద్దు పరిచి ఓ పి ఎస్ పునరుద్ధరించడం, 2003 డీఎస్సీ వారికి జీవో 57/4,57/5 అమలు పరచడం.
2. ఉమ్మడి సర్వీసు రూల్స్ సాధించడం
3. ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో పదోన్నతులు, బదిలీలు నిర్వహించడానికి కృషి చేయడం.
4. కేజీబీవీ లో పనిచేస్తున్న పిజిసిఆర్టి లకు, సిఆర్టి లకు మరియు ఎస్ఎస్ఎ లో పని అందరికీ "మినిమం టైం స్కేలు" ఇప్పించడం మరియు హెల్త్ కార్డులు ఇప్పించడానికి కృషి చేయడం.
5. మోడల్ స్కూల్ లో పనిచేస్తున్న మరియు గురుకులాల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించడం.
6 ఎయిడెడ్ స్కూల్స్ ని ప్రభుత్వ పాఠశాలలో విలీనం చేయడం
కామారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడం వారి హక్కుల సాధనలో కామారెడ్డి జిల్లా శాఖ క్రియాశీల పాత్ర పోషిస్తుందని, పదో తరగతి మూల్యాంకన కేంద్రం కామారెడ్డి జిల్లాకు కేటాయించడానికి పట్టు పట్టి సాధించారని జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు,ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మీరాజం ను అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆకునూరి మురళి సారథ్యంలోని విద్యా కమిషన్ ఉపాధ్యాయులకు వేతనాలు తగ్గించాలని చెప్పడం అవివేకమని, విద్యకు కేటాయించే నిధులు ఖర్చుగా చూడకూడదని పెట్టుబడిగా చూడాలి అని, ఉపాధ్యాయుల ద్వారా శిక్షణ పొందే విద్యార్థులు దేశానికి ఉత్తమ పౌరులుగా, అధికారులుగా నాయకులుగా ఎదుగుతారు అది పెట్టుబడికి ఫలితం గా మారుతుంది అని చెప్పారు.
ఈ సమావేశం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రత్నాకర్ రావు, కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ ఎన్. చంద్రశేఖర్ రావు, జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మీరాజం, అధ్యక్షులు ఓంప్రకాష్ , రాష్ట్ర, జిల్లా బాధ్యులు ఆనంద్, వెంకట్, మారుతి తదితరులు పాల్గొన్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >