Posted on 2026-02-28 04:28:47
డైలీ భారత్ డెస్క్: ఓఆర్ఆర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లకు వర్తించేలా జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కొత్త కోర్ అర్బన్ చట్టం రూపొందించాలని సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. అనుమతులు, రుసుములు, అభివృద్ధి పనులన్నీ ఆ చట్టం ఆధారంగా ఉండాలని సూచించారు.కోర్ అర్బన్ ఏరియాలో పారిశుద్ధ్యం, రోడ్ల నాణ్యత, వీధి దీపాల మానిటరింగ్, ఫుడ్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఆర్ & బీ తదితర విభాగాల పరిధిలోని రోడ్లన్నీ ఎంఏయూడీ పరిధిలోకి తేవాలని సూచించారు. ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, చెరువులు–కుంటల అభివృద్ధి, సుందరీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.సమీక్ష సమావేశంలో సీఎం సలహాదారు వేము నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి. శేషాద్రి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, ఎంఏయూడీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈ.వి. నరసింహారెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనర్లు కర్ణన్, జి. సృజన, వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >
రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బిజెపి శాసనసభా పక్ష సమావేశం
Posted On 2026-02-28 18:35:18
Readmore >
ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
Posted On 2026-02-28 17:50:47
Readmore >