Posted on 2026-02-20 13:27:22
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: పిల్లలను కొడితేనే చదువు వస్తుందనేది పాత కాలం నాటి మాట. నేటి చట్టం ప్రకారం విద్యార్థిని తాకడం లేదా తిట్టడం కూడా శిక్షార్హమైన నేరమే. ఆర్టిఐ యాక్ట్, 2009 (సెక్షన్ 17): విద్యాహక్కు చట్టం ప్రకారం స్కూల్లో పిల్లలను శారీరకంగా శిక్షించడం లేదా మానసికంగా వేధించడం పూర్తిగా నిషిద్ధం.
• సుప్రీంకోర్టు తీర్పు: పిల్లల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం రాజ్యాంగంలోని "ఆర్టికల్ 21" (జీవించే హక్కు) ఉల్లంఘన కిందకు వస్తుంది.
• జూవైనల్ జస్టిస్ యాక్ట్: పిల్లలపై క్రూరంగా ప్రవర్తించే టీచర్లు లేదా యజమాన్యాలకు జైలు శిక్ష మరియు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.
పరిష్కారం:
1. స్కూల్ మేనేజ్మెంట్కు ఫిర్యాదు: ముందుగా సదరు టీచర్పై ప్రిన్సిపాల్కి ఫిర్యాదు చేయండి. ఒకవేళ యాజమాన్యం ఆ టీచర్ని సమర్థిస్తే, ఆ స్కూల్పై చర్యలు తీసుకోవచ్చు.
2. SCPCR కి ఫిర్యాదు: ప్రతి రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (State Commission for Protection of Child Rights) ఉంటుంది. వీరికి ఆన్లైన్లో లేదా నేరుగా ఫిర్యాదు చేస్తే స్కూల్ గుర్తింపు రద్దు చేసే వరకు వెళ్తారు.
3. పోలీస్ ఎఫ్ఐఆర్ (FIR): బిడ్డకు గాయాలైనా లేదా తీవ్ర మానసిక ఆందోళనకు గురైనా BNS (భారతీయ న్యాయ సంహిత) కింద పోలీసులకు ఫిర్యాదు చేయండి.
4. చైల్డ్ లైన్ 1098: అత్యవసర సమయంలో ఎవరికి చెప్పాలో తెలియకపోతే 1098 కి ఫోన్ చేయండి. వారు తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుంటారు.
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >
మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-30 22:23:35
Readmore >
నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-05-30 17:55:56
Readmore >