అలిగి అమ్మగారింటికి వెళితే.. 3 నెలల జైలు శిక్ష.. అఫ్గాన్ లో కొత్త చట్టం
డైలీ భారత్ డెస్క్: ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఇకపై ఆఫ్ఘానిస్తాన్ లో మహిళలు గృహహింసపై ఫిర్యాదు చేసే సమయంలో భర్త లేదా తండ్రి ఆమె పక్కనే ఉండాలి. భర్తలు చేసే గృహహింసలో భార్యకు కనీసం ఎముకలు విరగాలి.. లేదంటే రక్తపు గాయాలు కావాలి. ఈ రెండూ జరిగితేనే ఫిర్యాదు చేయాల్సిఉంటుంది. ఒకవేళ భర్తపై కేసుపెట్టి.. కోర్టుకి వచ్చినా పక్కన భర్తతోనే రావాలి. నేరం రుజువైతే ఆ భర్తకు కేవలం 15 రోజుల జైలు శిక్ష విధిస్తారట.. ఒకవేళ భర్త కొట్టాడని.. భార్య చెప్పకుండా.. అలిగి అమ్మగారింటికి వెళితే ఆమెకు 3 నెలల జైలు శిక్ష విధిస్తారట.. ఈ కొత్త చట్టానికి అఫ్గాన్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అయితే ఈ కొత్త చట్టాలపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.