Posted on 2026-02-10 19:41:28
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మున్సిపాలిటీ ఎన్నికల విధుల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు మయంక్ మిట్టల్ మరియు కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు.మంగళవారం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల సాధారణ పరిశీలకులు మయంక్ మిట్టల్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డితో కలిసి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికి సంబంధించి శ్రీఇందు ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ అధికారులకు ఇచ్చిన ఎలక్షన్ మెటీరియల్ పంపిణిని పరిశీలించారు.ఈ సందర్బంగా సాధారణ పరిశీలకులు మయంక్ మిట్టల్ మాట్లాడుతూ పోలింగ్ విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ చెక్ లిస్ట్ ప్రకారం ఎన్నికల సామగ్రిని సరిచూసుకున్న తరువాతనే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి బయలుదేరి వెళ్లాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరిస్తూ విధులు బాధ్యతగా నిర్వహించాలని అన్నారు. 7.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. గడువు లోపు పోలింగ్ కేంద్రం లోనికి చేరుకున్న ఓటర్లకు సాయంత్రం 5.00 గంటలు దాటిన తరువాత కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పించామన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన సామాగ్రిని పోలింగ్ కేంద్రం వారిగా వేరు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందినదా, లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు జరిగేలా అంకితభావంతో కృషి చేయాలని ఎన్నికల సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. ఎక్కడ కూడా రీపోలింగ్ కు ఆస్కారం లేకుండా పక్కాగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలని, ఓటింగ్ సందర్భంగా గోప్యతను కాపాడేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల సామాగ్రిని, బ్యాలెట్ పేపర్లను, పోలింగ్ బాక్సులను పరిశీలించారు. బ్యాలెట్ పత్రాలు జాగ్రత్తగా చెక్ చేసి ప్యాక్ చేయాలని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ కేంద్రం చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు. చెక్ లిస్ట్ ప్రకారం పోలింగ్ మెటిరియల్ క్షుణ్ణంగా పరిశీలించి, అన్ని సరిగా ఉన్నాయని నిర్దారణ చేసుకొని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి బయలుదేరాలని సూచించారు. ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని, పోలింగ్ సిబ్బంది నిర్వహించే వారి విధులను క్షుణ్ణంగా వివరించారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించాలని అన్నారు. శేరిగూడలో మండల్ పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమును పరిశీలించారు. మహేశ్వరం డిసిపి మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలాంటి సంఘటనలు జరగకుండా భద్రత కల్పించడం జరుగుతుందని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంత్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-10 12:06:47
Readmore >
ప్రజల మధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు
Posted On 2026-03-10 11:54:35
Readmore >
ప్రజావాణి అర్జీలు పెండింగ్ లో పెట్టవద్దు... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-09 19:45:58
Readmore >
మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా మారిన భద్రాచలం ఎస్సీ కమ్యూనిటీ హాల్
Posted On 2026-03-09 19:22:17
Readmore >
కొమ్ముగూడెం గ్రామంలో నూతన పశువుల ఆసుపత్రి భవనాన్ని నిర్మించండి
Posted On 2026-03-09 19:20:29
Readmore >
ఐటిడిఏ కాంప్లెక్స్ దుకాణాల అన్యాక్రాంతం పై విచారణ జరిపించాలి
Posted On 2026-03-09 19:19:18
Readmore >
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
Posted On 2026-03-09 19:17:48
Readmore >