| Daily భారత్
Logo




ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో 4వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా

News

Posted on 2026-02-08 11:38:38

Share: Share


ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో 4వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతిరెడ్డి పద్మ రాంరెడ్డి

డైలీ భారత్, హుజూర్ నగర్: హుజూర్ నగర్ మున్సిపల్ ఎన్నికల్లో తనని గెలిపిస్తే వార్డును మరింత అభివృద్ధి చేస్తానని 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దొంతిరెడ్డి పద్మ రాంరెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలోని 4వ వార్డులో గడపగడపకు తిరుగుతూ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా పద్మ రాంరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం ఉపాధి జరుగుతుందని అన్నారు.చేయి గుర్తుపై అమూల్యమైన ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరారు తాను నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. వార్డులో డ్రైనేజీ,సీసీ రోడ్లు, వీధిలైట్లు, మంచినీరు తదితర సమస్య లేకుండా కృషి చేస్తానన్నారు. ప్రజల రక్షణ కోసం వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. బూత్ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా ప్రణాళికతో సైనికుల్లా పనిచేసి పార్టీ అభ్యర్థులను మరియు పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కొరకు కృషి చేయాలని  కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మధిర ప్రతాప్ రెడ్డి, దాసా నాగేశ్వర్రావు, ఆంజనేయులు, శివ తదితరులు పాల్గొన్నారు.

Image 1

భద్రాచలం సర్పంచ్ పున్నెం కృష్ణ ఘనంగా సన్మానించిన మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతాకుమారి

Posted On 2026-02-14 08:27:20

Readmore >
Image 1

జూలూరుపాడు మండల ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతకుమారి

Posted On 2026-02-14 07:54:12

Readmore >
Image 1

మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణానికి ముస్తాబైన పాపకొల్లు శ్రీ శ్రీ ఉమా సోమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం

Posted On 2026-02-14 07:47:12

Readmore >
Image 1

శీర్షిక : మహాశివరాత్రి

Posted On 2026-02-14 03:45:48

Readmore >
Image 1

శీర్షిక : రేడియో

Posted On 2026-02-14 03:24:57

Readmore >
Image 1

షాద్ నగర్ మున్సిపాలిటీ 25 వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి సి.పెంటయ్య విజయం

Posted On 2026-02-13 15:28:44

Readmore >
Image 1

తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-02-10 15:52:53

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : దొంగతనం కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్,రిమాండ్

Posted On 2026-02-10 15:17:37

Readmore >
Image 1

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి

Posted On 2026-02-10 15:12:38

Readmore >
Image 1

మున్సిపల్ ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

Posted On 2026-02-10 15:11:28

Readmore >