Posted on 2026-02-07 12:55:10
డైలీ భారత్, సిరిసిల్ల: పేద మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, ప్రభుత్వ పాఠశాలలో చదివి, కష్టసాధ్యమైన ప్రయాణం ద్వారా అమెరికాలో డాక్టర్గా స్థిరపడ్డ డా. కుసుమ విట్టల్ మరోసారి తమ సేవాభావాన్ని చాటుకున్నారు.
తాను చదువుకున్న కుసుమ రామయ్య ఉన్నత పాఠశాల, సిరిసిల్లకు రూ.10 లక్షల విరాళం అందజేసి, పేద విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన బాట వేశారు.
ఈ సహాయం 6వ నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పేద విద్యార్థులందరికీ వారి విద్యా అవసరాలు, మౌలిక వసతులు, ప్రతిభాభివృద్ధికి ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో ఈ విరాళం అందించడం విశేషం.
ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తన మూలాలను మరవకుండా, తాను ఎదిగిన పాఠశాలకే తిరిగి చేయూతనివ్వడం ఆయన దాతృత్వానికి నిలువెత్తు నిదర్శనం. ఈ విరాళం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ, “మేము కూడా ఉన్నత స్థానాలకు చేరగలం” అనే ఆశను రగిలిస్తోంది.
డా. కుసుమ విట్టల్ సేవాభావానికి సిరిసిల్ల ప్రజల హృదయపూర్వక అభినందనలు
విద్యే భవిష్యత్తు… సేవే నిజమైన సంపద.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోతిలాల్, స్టాఫ్ సెక్రటరీ శంకర్ గౌడ్, కుసుమ శ్రీధర్, వేముల శ్రీనివాస్, భూమేష్, పురుషోత్తం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >