Posted on 2026-02-05 08:05:57
బహుజన రాజ్యంతోనే పేదలకు న్యాయం, అభివృద్ధి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి కురిమెల్ల శంకరయ్య మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బహుజన రాజ్య స్థాపన ద్వారానే పేదలు, అణగారిన వర్గాలకు నిజమైన న్యాయం, అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం రావాలంటే అధికారంలోకి బహుజనులే రావాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు మౌలిక వసతుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
ముఖ్యంగా పేదలకు విద్య, వైద్యం, ఉపాధి, నివాసం వంటి మౌలిక హక్కులు దూరమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక ప్రాంతాల్లో డ్రైనేజీ, రహదారులు, తాగునీరు, వీధి దీపాల వంటి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు.
బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు ఉచిత విద్య, నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు సంక్షేమ పథకాల అమలు పూర్తిస్థాయి పారదర్శకతతో జరుగుతుందని తెలిపారు. సమాజంలో మార్పు కోరుకునే ప్రజలు ఏనుగు గుర్తుపై ఓటు వేసి బహుజన అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >
వడదెబ్బకు మృతి చెందిన పురేటి బ్రహ్మయ్య కుటుంబానికి100 కేజీల బియ్యం
Posted On 2026-06-22 19:49:36
Readmore >
వైరా నియోజకవర్గం : కమ్మవారి కల్యాణ మండపంలో బిఆర్ఎస్ పార్టీ ఓటర్ జాబితా సవరణ సభ్యత్వ నమోదు కార్యక్రమం
Posted On 2026-06-22 19:48:03
Readmore >
చెన్నై ట్రాఫిక్ కానిస్టేబుల్ వ్యవహారం : భార్య అమర్చిన రహస్య CCTVలో భర్త
Posted On 2026-06-22 19:44:31
Readmore >
నేరెళ్ల పీహెచ్సీని సందర్శించిన డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పవిత్ర
Posted On 2026-06-22 18:54:32
Readmore >
మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-22 16:16:28
Readmore >