Posted on 2026-02-05 03:33:27
డైలీ భారత్, హైదరాబాద్: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో గద్దర్ ఫిలిం అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని, దేశవ్యాప్తంగా ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాద్ను కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అన్ని భాషల సినీ పరిశ్రమలు హైదరాబాద్కు వస్తే యువతకు, టెక్నీషియన్లు, రచయితలు, దర్శకులకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
సమాజం కోసం కళల ద్వారా తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్ అని పేర్కొంటూ, ఆయన పేరుతో సినిమా అవార్డులు ప్రారంభించి సినీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రతిభ, పారదర్శకతే గద్దర్ ఫిలిం అవార్డుల ప్రధాన ప్రమాణమని స్పష్టం చేశారు.
ఈ నెల 6 నుంచి అవార్డుల స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుందని, 19న ఉగాది పండుగ రోజున గద్దర్ ఫిలిం అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >