Posted on 2026-02-05 08:03:27
డైలీ భారత్, హైదరాబాద్: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో గద్దర్ ఫిలిం అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని, దేశవ్యాప్తంగా ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాద్ను కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అన్ని భాషల సినీ పరిశ్రమలు హైదరాబాద్కు వస్తే యువతకు, టెక్నీషియన్లు, రచయితలు, దర్శకులకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
సమాజం కోసం కళల ద్వారా తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్ అని పేర్కొంటూ, ఆయన పేరుతో సినిమా అవార్డులు ప్రారంభించి సినీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రతిభ, పారదర్శకతే గద్దర్ ఫిలిం అవార్డుల ప్రధాన ప్రమాణమని స్పష్టం చేశారు.
ఈ నెల 6 నుంచి అవార్డుల స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుందని, 19న ఉగాది పండుగ రోజున గద్దర్ ఫిలిం అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.
తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-14 22:05:48
Readmore >
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం
Posted On 2026-03-14 19:39:44
Readmore >
జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు
Posted On 2026-03-14 19:33:15
Readmore >
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >