Posted on 2026-02-04 20:15:22
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీస్ స్టేషన్ సుజాతనగర్ మండలం కార్పొరేషన్ పరిధిలోని నాలుగు డివిజన్ లో కార్పొరేషన్ ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులకు సుజాతనగర్ పోలీసు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అవగాహన సదస్సులో చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ . రాయలవెంకటేశ్వర్లు, , సుజాతనగర్ తాసిల్దార్, సుజాతనగర్ ఎస్సై ఏం.రమాదేవి పోటీ చేస్తున్న అభ్యర్థులకు సూచనలు తెలియజేయడం జరిగింది ఎన్నికల ప్రచారం కొరకు వాహనాలను మరియు మైకుల కు కచ్చితంగా మున్సిపల్ కమిషనర్ మరియు డిఎస్పీ పర్మిషన్ తీసుకోవాలి. పబ్లిక్ మీటింగ్లు ర్యాలీలు తీయడానికి పర్మిషన్ తీసుకోవాలి. సోషల్ మీడియాలో వ్యక్తిగతమైన, కుటుంబాన్ని ఉద్దేశించి, వర్గాల మధ్య చిచ్చుపెట్టే విధంగా, పోస్టులు పెట్టే వారిపై, గ్రూపు అడ్మిన్ పై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎలక్షన్ రోజుకి 48 గంటల ముందు ప్రచారం ఆపివేయాలి. 50 వేలకు మించి డబ్బు కలిగి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు కలిగి ఉండాలి లేనిచో అట్టి డబ్బులు సీజ్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ రోజు పోలింగ్ బూత్ కు వంద మీటర్ల దూరంలో ఎటువంటి ప్రచారం గానీ, పార్టీ గుర్తులు గాని చూపించరాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమాలని పాటించాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ పోలీస్ సిబ్బంది సుజాతనగర్ మండల ప్రజలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు
తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-14 22:05:48
Readmore >
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం
Posted On 2026-03-14 19:39:44
Readmore >
జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు
Posted On 2026-03-14 19:33:15
Readmore >
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >