Posted on 2026-02-04 17:09:55
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ ఎన్నికల ఖర్చులపై పూర్తి అవగాహన కల్పించేందుకు ఎన్నికల ఖర్చుల అవగాహన కార్యక్రమం సి నా రే కళా మందిరం లో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ఎన్నికల నియమావళి, ఖర్చుల పరిమితి, ఖర్చుల వివరాల నమోదు విధానం, డే టు డే అకౌంట్ నిర్వహణ, షాడో రిజిస్టర్ నిర్వహణ, బ్యాంక్ అకౌంట్ వినియోగం వంటి అంశాలపై అభ్యర్థులకు వివరంగా అవగాహన కల్పించారు.
అభ్యర్థులు ఎన్నికల ఖర్చులను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తూ, భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. అనుమతి లేని ఖర్చులు చేయరాదని, చేసిన ప్రతి ఖర్చుకు సంబంధించిన బిల్లులు, వౌచర్లు తప్పనిసరిగా భద్రపరచాలని సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమం ద్వారా అభ్యర్థుల్లో ఎన్నికల ఖర్చులపై స్పష్టత ఏర్పడి, స్వచ్ఛమైన, న్యాయమైన మరియు పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఇది దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ , రిటర్నింగ్ ఆఫీసర్లు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు స్వతంత్ర అభ్యర్థులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >