Posted on 2026-02-04 12:39:55
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ ఎన్నికల ఖర్చులపై పూర్తి అవగాహన కల్పించేందుకు ఎన్నికల ఖర్చుల అవగాహన కార్యక్రమం సి నా రే కళా మందిరం లో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ఎన్నికల నియమావళి, ఖర్చుల పరిమితి, ఖర్చుల వివరాల నమోదు విధానం, డే టు డే అకౌంట్ నిర్వహణ, షాడో రిజిస్టర్ నిర్వహణ, బ్యాంక్ అకౌంట్ వినియోగం వంటి అంశాలపై అభ్యర్థులకు వివరంగా అవగాహన కల్పించారు.
అభ్యర్థులు ఎన్నికల ఖర్చులను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తూ, భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. అనుమతి లేని ఖర్చులు చేయరాదని, చేసిన ప్రతి ఖర్చుకు సంబంధించిన బిల్లులు, వౌచర్లు తప్పనిసరిగా భద్రపరచాలని సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమం ద్వారా అభ్యర్థుల్లో ఎన్నికల ఖర్చులపై స్పష్టత ఏర్పడి, స్వచ్ఛమైన, న్యాయమైన మరియు పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఇది దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ , రిటర్నింగ్ ఆఫీసర్లు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు స్వతంత్ర అభ్యర్థులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >