Posted on 2026-02-02 19:48:19
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలో ఉన్న కాకర్ల , సూరారం , గురువాగు తండా , వెంగన్నపాలెం , అన్నారుపాడు , సాయిరాం తండా గ్రామాలకు చెందిన మహిళలకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ , సిలిండర్లను జూలూరుపాడు మండల బీజేపీ అధ్యక్షుడు భూక్యా రమేష్ గారు పంపిణీ చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సాధికారతకోసం , వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం , కట్టెల పొయ్యి నుంచి మహిళలను విముక్తి పరచడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉజ్వల యోజన పథకాన్నీ ప్రారంభించడం జరిగిందని మరియు మహిళల అభ్యున్నతి కోసం దేశ వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలనుప్రవేశపెడుతున్నారు అని వారు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రామారావు, ఉపాధ్యక్షుడు బాలకిషన్,యువ మోర్చా అధ్యక్షుడు రాంబాబు , గిరిజన మోర్చా అధ్యక్షుడు రవి , కార్యదర్శి బాబూలాల్ , సోషల్ మీడియా కన్వీనర్ చరణ్ తదితరులు పాల్గొన్నారు
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >