Posted on 2026-02-01 22:26:49
డాక్టర్ పైడి ఎల్లారెడ్డి గారు రాష్ట్ర నాయకులు!
డైలీ భారత్, కామారెడ్డి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా కేంద్ర బడ్జెట్ , వేల కోట్ల నిధులతోనే తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ బడ్జెట్ స్పష్టంగా చాటిచెప్పింది.
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా ఉన్న హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పం ఈ బడ్జెట్లో కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఆరోపణలు చేస్తూ కాలం వృథా చేస్తే, కేంద్ర ప్రభుత్వం మాత్రం అభివృద్ధికి అవసరమైన నిధులు, విధానాలు, అవకాశాలు అందిస్తోంది.
అర్బన్ ఛాలెంజ్ ఫండ్ – మాటల కాదు, మెట్రోకు నిధులు
పట్టణాభివృద్ధి కోసం ప్రకటించిన ₹1 లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద హైదరాబాద్కు కీలక అవకాశాలు కల్పించారు.
ఈ ఫండ్ ద్వారా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 (Phase IIA & IIB) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ట్రాఫిక్ సమస్యలపై రాజకీయాలు చేసినవారు, ఇప్పుడు కేంద్రం ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి.
RRR దక్షిణ భాగానికి లైన్ క్లియర్ – అభివృద్ధికి అడ్డంకి ఎవరు?
ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న రీజినల్ రింగ్ రోడ్ (RRR) దక్షిణ భాగానికి లైన్ క్లియర్ చేయడం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాత్మకతకు నిదర్శనం.
ఈ ప్రాజెక్ట్ ద్వారా
– హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు సమగ్ర అభివృద్ధి
– పరిశ్రమల వికేంద్రీకరణ
– రైతులకు భూముల విలువ పెరుగుదల
– యువతకు ఉద్యోగ అవకాశాలు సాధ్యమవుతాయి.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, అనుమతుల పేరుతో అడ్డంకులు పెట్టడం మానుకోవాలి.
₹40 వేల కోట్ల సెమీకండక్టర్ మిషన్ 2.0 – హైదరాబాద్కు హైటెక్ భవిష్యత్
సెమీకండక్టర్ మిషన్ 2.0 కోసం ₹40 వేల కోట్లు కేటాయించడం ద్వారా హైదరాబాద్ను హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చే దిశగా కేంద్రం పెద్ద అడుగు వేసింది.
కేంద్రం అవకాశాలు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పరిశ్రమలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడంలో విఫలమవుతోంది.
బయోఫార్మా శక్తి – హైదరాబాద్ ఫార్మా రాజధానికి కేంద్ర బలం
ప్రపంచ ఫార్మా రాజధానిగా గుర్తింపు పొందిన హైదరాబాద్కు మరింత బలం చేకూర్చేందుకు "బయోఫార్మా శక్తి" పథకం కింద ₹10 వేల కోట్లు కేటాయించారు.
ఇది ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశోధనలకు కొత్త దారులు తెరవనుంది.
కేంద్రం నిధులు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం క్రెడిట్ రాజకీయాల్లో మునిగిపోతోంది.
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >