Posted on 2026-01-29 14:07:04
ప్రయాణికులు ప్రజల కనీస అవసరాన్ని తీర్చండి. భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ మండల అధికారులకు ప్రజాప్రతినిధులకు డిమాండ్.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుమండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ మాట్లాడుతూ మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు నిత్యం ప్రభుత్వ కార్యాలకు వ్యాపార సముదాయాలకు అనేక పనులపై వస్తూ ఉంటారని వారి కనీస అవసరాలకు పబ్లిక్ టాయిలెట్స్ లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. దూర ప్రాణికుల కొరకు బస్సు కొరకు వేచి చూసే ప్రయాణికులు మహిళలు వృద్ధులు, చిన్న పిల్లలు పబ్లిక్ టాయిలెట్స్ లేక ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రం మొత్తం వ్యాపార సముదాయాలకు రద్దీగా ఉంటుందని దీంతో ప్రజలు కనీసం అవసరమైన టాయిలెట్ కొరకు అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు మండల కేంద్రంలో పబ్లిక్ టాలెంట్ నిర్మిస్తే ప్రయాణికులకు ప్రజలకు ఇబ్బందులు ఉండవని జూలూరుపాడు మండల కేంద్రంలో పబ్లిక్ టాలెంట్ నిర్మించే లాగా కృషి చేయాలని ఆయన కోరారు. మండల ప్రధాన సెంటర్లో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు ఎండలో వర్షంలో నిలబడి ఉండాల్సి వస్తుందని ఖమ్మం వైపు భద్రాచలం వైపుకు బస్ కొరకు ఎదురు చూసే సమయంలో బస్ షెల్టర్ లేక ఎండకు ఎండుతున్నారని వర్షానికి తడుస్తూ బస్సుల కోసం నిలబడి చూడాల్సి వస్తుందని ఆయన వివరించారు. బస్ షెల్టర్ నిర్మిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తక్షణమే మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్ బస్సు షెల్టర్ నిర్మించడానికి అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆయన కోరారు.
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >