| Daily భారత్
Logo




మహిళ సమైక్య నూతన కార్యవర్గం ఎన్నిక

News

Posted on 2026-01-08 16:28:29

Share: Share


మహిళ సమైక్య నూతన కార్యవర్గం ఎన్నిక

అధ్యక్షురాలిగా కవిత, ఉపాధ్యక్షురాలిగా రూపా

మహిళలు కోటీశ్వరులుగా ఎదగాలి

మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి.

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలో పట్టణ సమైక్య నూతన కార్యవర్గ ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ సమాఖ్యల నుంచి వచ్చిన అధ్యక్షులు, కార్యదర్శులు ఎన్నికల్లో పాల్గొన్నారు.

ఈ ఎన్నికల్లో కవితను అధ్యక్షురాలిగా, రూపాను ఉపాధ్యక్షురాలిగా, మంజులను కార్యదర్శిగా, పద్మను కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, టీఎంసీ రవిశంకర్, సీఓ అనసూయతో పాటు వివిధ సమాఖ్యల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, మహిళా సంఘాలు తప్పనిసరిగా పంచసూత్రాలను పాటించాలని సూచించారు. రుణాలు తీసుకున్న మహిళలు వాటిని సకాలంలో తిరిగి చెల్లించాలన్నారు. అలాగే ఆదాయాభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించి, స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలపడాలని మహిళలకు పిలుపునిచ్చారు. మహిళలందరూ సంఘటితంగా పనిచేస్తే కుటుంబాలే కాక సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు.

నూతన కార్యవర్గం మహిళల సంక్షేమం, ఆర్థిక సాధికారత కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చింది.

Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >
Image 1

ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం

Posted On 2026-07-27 06:58:57

Readmore >
Image 1

కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభమైంది..

Posted On 2026-07-27 06:48:26

Readmore >