| Daily భారత్
Logo




ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలి

News

Posted on 2026-01-05 12:20:59

Share: Share


ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలి

ఆకస్మిక పర్యటనలు చేయడం తన అలవాటు.

జిల్లా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా..

స్పష్టం చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులే స్వయంగా ప్రజావాణిలో పాల్గొనాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ లతో కలిసి కలెక్టర్ ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 70 వినతులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ప్రజావాణి వినతుల స్వీకరణ పూర్తయిన అనంతరం అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను వెంటవెంటనే పరిశీలించి, పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని తక్షణమే పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న తరహాలోనే జిల్లా ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం ప్రగతిని పర్యవేక్షించేందుకు ఆన్లైన్ విధానాన్ని అవలంభిస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీదారులు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగకుండా సమస్యల సత్వర పరిష్కారానికి చొరవ చూపాలని హితవు పలికారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆయా శాఖల జిల్లా అధికారులు ప్రజావాణికి గైర్హాజరు కాకూడదని, కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో ప్రజలు తరలివచ్చి ప్రజావాణిలో వినతులు, ఫిర్యాదులు అందిస్తారని, జిల్లా అధికారులు అందుబాటులో ఉంటూ పరిష్కరించేందుకు అనువుగా ఉన్న వాటిని అప్పటికప్పుడే పరిష్కరించాలని ఆదేశించారు. ఆయా శాఖలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతోందనే విషయాలను తెలుసుకునేందుకు, శాఖా పరమైన అంశాలను గమనించేందుకు  ప్రజావాణి కార్యక్రమం వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లా అధికారులు తప్పనిసరిగా ప్రజావాణిలో పాల్గొనాలని, ప్రజలు సమర్పించే అర్జీలను పరిష్కరించేందుకు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.  కాగా, మండల ప్రత్యేక అధికారులు జిల్లా ప్రగతిలో క్రియాశీలక పాత్ర పోషించాలని, క్షేత్రస్థాయిలో ఆకస్మిక పర్యటనలు చేయడం తనకు అలవాటాన్ని ఆమె అన్నారు. ఆయా కార్యక్రమాలు, పథకాల అమలు తీరును నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. ప్రతి శాఖ పనితీరు సమర్ధవంతంగా ఉండాలన్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నందున, సంబంధిత అధికారులు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని అన్నారు. ముఖ్యంగా ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి ప్రలోభాలు, ఒత్తిళ్లకు తావులేకుండా పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఫాం-6, ఫాం-7 పరిష్కారంలో స్పష్టమైన ప్రగతి కనిపించాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ పీ.డీ పవన్ కుమార్, నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డి తదితరులు ఫిర్యాదులు స్వికరించగా, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం అధికారులు కలెక్టర్ ను ఆమె ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించారు.

Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >
Image 1

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

Posted On 2026-07-30 17:09:03

Readmore >
Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >
Image 1

వేములవాడ, సిరిసిల్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Posted On 2026-07-30 16:24:01

Readmore >
Image 1

హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్

Posted On 2026-07-30 16:19:48

Readmore >
Image 1

ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

Posted On 2026-07-30 16:14:52

Readmore >
Image 1

సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు

Posted On 2026-07-30 16:09:18

Readmore >
Image 1

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం... మంజుల పత్తిపాటి

Posted On 2026-07-30 13:39:47

Readmore >
Image 1

సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్

Posted On 2026-07-30 13:36:16

Readmore >