Posted on 2026-01-05 11:54:56
కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో ప్రత్యేకంగా ప్రాథమిక సహకార సంఘం ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ దేవేందర్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగిన ప్రజావాణిలో గ్రామ సర్పంచ్ తోపాటు గ్రామ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ డిమాండ్ ను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ వెల్మల్ గ్రామానికి సంబంధించిన రెవెన్యూ శివారులో నాలుగు ఎకరాల 100 గజాల స్థలం ఉందని, అందులో పిఎసిఎస్ లో తమ గ్రామం నుండి 13 వరకు సభ్యత్వం ఉందని ఆయన అన్నారు. అయితే రెండు సీజన్లకు కలిపి ఒక లక్ష క్వింటాళ్ల ధాన్యాన్ని తమ గ్రామా రైతులు పండిస్తారని ఆయన తెలిపారు. అయితే తమకు చెందిన నూతన సొసైటీని నందిపేట్ లో ఏర్పాటు చేసి వెల్మల్ గ్రామాన్ని అందులో కలిపే కుట్రలు జరుగుతున్నాయని తమ గ్రామస్తుల దృష్టికి వచ్చిందన్నారు. నందిపేట్ లో తమకు చెందిన సొసైటీ ఏర్పాటుకు తాము ఎలాంటి వ్యతిరేకము కాదని కానీ మమ్మల్ని అందులో విలీనం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. రెవిన్యూ పరంగా జిల్లాలోనే ధాన్యం పండించడంలో రెండవ స్థానంలో తమ గ్రామం ఉందని ఆయన అన్నారు. కావున జిల్లా అధికారులు అధికార పార్టీ నేతలు తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని తమ గ్రామంలో ప్రత్యేకంగా పి ఎస్ సి ఎస్ ఏర్పాటు చేయాలని గ్రామ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందన్నారు. లేనియెడల రాబోయే ఎన్నికలను వెల్మల్ గ్రామ ప్రజలు పూర్తిగా బహిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. కావున తమ గ్రామానికి ప్రత్యేకంగా పిఎసిఎస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఇస్సపల్లి మహేష్, మాజీ సర్పంచ్ మచ్చర్ల గంగారం, నాయకులు కస్ప రామకృష్ణ, రాము, జి ఆర్ రాజేందర్, మల్లేష్, శ్రీధర్, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >
హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Posted On 2026-07-30 16:19:48
Readmore >
ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
Posted On 2026-07-30 16:14:52
Readmore >
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >