Posted on 2026-01-04 20:21:55
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా తల్లాడ మండలంసమాజంలో ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటించి, ప్రమాదాలను నివారించాలని తల్లాడ ఎస్సై వెంకటకృష్ణ సూచించారు. సత్తుపల్లి ఏసిపి ఆదేశాల మేరకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా తల్లాడ పట్టణంలో వాహనదారులకు హెల్మెట్ ధరించటంపై బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి తల్లాడ పట్టణంలోని ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి అవగాహన కల్పనలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు వెల్లడించారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు అని సూచించారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ను తప్పనిసరిగా వాడాలన్నారు. రాజకీయ పార్టీల నాయకులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వాహనదారులు ర్యాలీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై 2 వెంకటేష్, కానిస్టేబుల్స్, రాజకీయ నాయకులు యువకులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >