Posted on 2026-01-04 18:41:31
బస్టాండ్ల అభివృద్ధికి ముందుకొచ్చిన ఉప్పల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ పటేల్
డైలీ భారత్, రాంనగర్:ప్రజల విజ్ఞప్తి మేరకు ఉప్పల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఆకారపు అరుణ్ పటేల్ తన స్వంత ఖర్చులతో పలు కాలనీల బస్టాండ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. తన మాతృమూర్తి (అమ్మమ్మ) స్వర్గీయ బిళ్ళకంటి ఆండాలు జ్ఞాపకార్థం, ప్రయాణికుల సౌకర్యార్థం 15 బస్సు టైమింగ్ బోర్డులు, 15 సిమెంట్ కుర్చీలను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు మందమూళ్ళ పరమేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా రామ్ రెడ్డి నగర్, కామాక్షిపురం, సత్య నగర్, శ్రీనగర్ కాలనీ మరియు సాయి కృష్ణ నగర్ కాలనీల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణ్ పటేల్ మాట్లాడుతూ, పదవి ఉన్నా లేకపోయినా సామాన్య పౌరుడిగా ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని తెలిపారు. తన స్వంత డబ్బుతో ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాలు ప్రయాణికులకు ఉపయోగపడటం ఆనందంగా ఉందన్నారు.
భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో ముందుకు సాగేందుకు ఈ కార్యక్రమం తనకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు కాంగ్రెస్ కుటుంబ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >