Posted on 2026-01-01 18:41:45
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని స్థానిక మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రే కన్స్ట్రక్షన్ వారి దివ్యాంగుల పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలను న్యూ ఇయర్ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి సురాబత్తుని శ్రీనివాసరావు జిల్లా చైర్మన్ ఐ క్యాంప్స్, ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాల లో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ చాలా సంవత్సరాల నుండి సేవలను అందిస్తుందని రాబోయే కాలంలో కూడా స్నేహ సొసైటీ ప్రారంభించబోతున్న కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ చాలా సేవా కార్యక్రమాలను చేపట్టి పేదలకు, వృద్ధులకు, దివ్యాంగులకు సేవలను అందిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్నేహసొసైటీ కార్యదర్శి సిద్దయ్య మాట్లాడుతూ 2026 సంవత్సరంలో వయోజన దివ్యాంగులకు వృత్తి నైపుణ్యాలను పెంచడానికి వృత్తి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తుందని అదేవిధంగా వృద్ధాశ్రమాన్ని పునః ప్రారంభిస్తుందని, చారిటీ కంటి ఆసుపత్రిని తిరిగి ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యవర్గ సభ్యులు టి. వీరేశం, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ కార్యదర్శి కే పోశెట్టి, కోశాధికారి కే సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు కే లక్ష్మణ్, స్నేహ సొసైటీ దివ్యంగా బాలలు సిబ్బంది, స్నేహ సొసైటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >