Posted on 2025-12-31 15:33:56
డైలీ భారత్, సిరిసిల్ల: తెలంగాణ టీచర్స్ యూనియన్(టి టి యు) రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శిగా దూస మధు బుధవారం రోజున నియమితులయ్యారు. సిరిసిల్ల పట్టణం లోని అంబేద్కర్ నగర్ ప్రాథమిక పాఠశాలలో ఎస్ జీ టీ గా పనిచేస్తున్న దూస మధుని నియమిస్తున్నట్ల టి టి యు రాష్ట్ర అధ్యక్షుడు మునిగాల మణిపాల్ రెడ్డి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొలంపెల్లి ఆదర్శన్ రెడ్డి, టి టి యు రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడు కొండి కొప్పుల రవి నియామక ఉత్తర్వులు అందించారు.
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతానని ప్రభుత్వానికి ఉపాధ్యాయుల గళాన్ని బలంగా వినిపించే విధంగా సంఘాన్ని ముందుకు నడిపిస్తానని తెలిపారు. ఉపాధ్యాయుల హక్కులు,సంక్షేమం ,విద్యా ప్రమాణాల కోసం తెలంగాణ టీచర్స్ యూనియన్ కృషి చేస్తుందని అన్నారు.తన నియామకం కోసం కృషి చేసిన జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి కి మరియు తనను నియమించిన రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >