| Daily భారత్
Logo




సహకార సంఘాల కమిటీ లకు కాంగ్రెస్ కార్యకర్తలను నామినేట్ చేయాలనే ప్రభుత్వం ఆలోచన విరమించుకోవాలి

News

Posted on 2025-12-25 22:02:33

Share: Share


సహకార సంఘాల కమిటీ లకు కాంగ్రెస్ కార్యకర్తలను నామినేట్ చేయాలనే ప్రభుత్వం ఆలోచన విరమించుకోవాలి

డిసెంబర్ 26 నుంచి సోసైటి కార్యాలయాలు వద్ద రైతులు నిరసన 

రైతు సంఘం జిల్లా సమావేశంలో కార్యదర్శి బొంతు రాంబాబు 

డైలీ భారత్ న్యూస్, ఖమ్మం:ఖమ్మం జిల్లా ప్రాధమిక సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార సంస్థలకు కాంగ్రెస్ కార్యకర్తలను నామినేట్ చేసి పాలకమండల్లను నియమించాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని  డిసెంబర్ 26 నుంచి సోసైటి కార్యాలయాలు వద్ద రైతులు నిరసన జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. ఖమ్మం సుందరయ్య భవన్ లో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్ అధ్యక్షతన జరిగిన రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం లో రాంబాబు మాట్లాడుతూ రైతులు సమిష్టి గా నిర్వహించే సోసైటి ల పాలకమండలి ఇప్పటి వరకు రైతు సభ్యులు తమ ప్రతినిధులను ఎన్నికల ద్వారా ఎంపిక జరుగుతుంది అని నేడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలను నామినేట్ చేసి సహాకార వ్యవస్ధను ధ్వంసం చేయుటకు ప్రయాత్నాలు చేయడం అప్రజాస్వామికం అన్నారు. వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు చేటు చేస్తుందని కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణల సర్కులర్ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని అన్నారు, రబీ సీజన్ సన్న ధాన్యం బోనస్ 63 కోట్ల ఖమ్మం జిల్లా రైతులకు అందించాలని కోరారు, మిర్చి రైతులకు పరిహారం అందించాలి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాతా భాస్కర్ రావు, ఎస్ కె మీరా, వాసిరెడ్డి ప్రసాద్, దుగ్గి కృష్ణ,సహాయ కార్యదర్శులు గొడవర్తి నాగేశ్వరరావు, దొండపాటి నాగేశ్వరరావు, బోడేపూడి వీరభద్రం,కోల్లెటి ఉపేందర్, కూచిపూడి మధు, బింగి రమేష్, వజ్జా రామారావు, అన్నా సాగరం సర్పంచ్ బొడ్డు రాంబాబు,కిలారు సురేష్ తదితరులు పాల్గొన్నారు

Image 1

చండ్రుగొండ మండలంలో మహిళా హత్యకేసులో నిందితుడు అరెస్ట్

Posted On 2026-04-30 09:56:08

Readmore >
Image 1

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత

Posted On 2026-04-29 19:01:13

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష

Posted On 2026-04-29 18:50:39

Readmore >
Image 1

చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్

Posted On 2026-04-29 18:41:17

Readmore >
Image 1

మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

Posted On 2026-04-29 18:39:55

Readmore >
Image 1

పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565

Posted On 2026-04-29 18:37:39

Readmore >
Image 1

ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..

Posted On 2026-04-29 17:26:42

Readmore >
Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >