Posted on 2025-12-25 17:32:33
డిసెంబర్ 26 నుంచి సోసైటి కార్యాలయాలు వద్ద రైతులు నిరసన
రైతు సంఘం జిల్లా సమావేశంలో కార్యదర్శి బొంతు రాంబాబు
డైలీ భారత్ న్యూస్, ఖమ్మం:ఖమ్మం జిల్లా ప్రాధమిక సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార సంస్థలకు కాంగ్రెస్ కార్యకర్తలను నామినేట్ చేసి పాలకమండల్లను నియమించాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిసెంబర్ 26 నుంచి సోసైటి కార్యాలయాలు వద్ద రైతులు నిరసన జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. ఖమ్మం సుందరయ్య భవన్ లో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్ అధ్యక్షతన జరిగిన రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం లో రాంబాబు మాట్లాడుతూ రైతులు సమిష్టి గా నిర్వహించే సోసైటి ల పాలకమండలి ఇప్పటి వరకు రైతు సభ్యులు తమ ప్రతినిధులను ఎన్నికల ద్వారా ఎంపిక జరుగుతుంది అని నేడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలను నామినేట్ చేసి సహాకార వ్యవస్ధను ధ్వంసం చేయుటకు ప్రయాత్నాలు చేయడం అప్రజాస్వామికం అన్నారు. వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు చేటు చేస్తుందని కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణల సర్కులర్ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని అన్నారు, రబీ సీజన్ సన్న ధాన్యం బోనస్ 63 కోట్ల ఖమ్మం జిల్లా రైతులకు అందించాలని కోరారు, మిర్చి రైతులకు పరిహారం అందించాలి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాతా భాస్కర్ రావు, ఎస్ కె మీరా, వాసిరెడ్డి ప్రసాద్, దుగ్గి కృష్ణ,సహాయ కార్యదర్శులు గొడవర్తి నాగేశ్వరరావు, దొండపాటి నాగేశ్వరరావు, బోడేపూడి వీరభద్రం,కోల్లెటి ఉపేందర్, కూచిపూడి మధు, బింగి రమేష్, వజ్జా రామారావు, అన్నా సాగరం సర్పంచ్ బొడ్డు రాంబాబు,కిలారు సురేష్ తదితరులు పాల్గొన్నారు
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >