డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి: అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం.(ABABS) షాద్ నగర్ నియోజకవర్గం అధ్యక్షుడిగా రబ్బనమొని నందు ను నియమించినట్లు అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ కార్యవర్గ కమిటీ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన నందు మాట్లాడుతూ ప్రతి నిత్యం అయ్యప్ప భక్తుల సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని, అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు తనను నియోజకవర్గా అధ్యక్షుడుగా నియమించిన జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్యకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.