Posted on 2025-12-23 19:40:15
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామ నూతన సర్పంచ్గా ఎన్నికైన శ్రీదివ్య మురళీధర్ రెడ్డి, ఉపసర్పంచ్ మైసాని లావణ్య హరితో పాటు వార్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో పాటు ఆయన ముఖ్య అతిథిగా హాజరై సర్పంచ్ శ్రీదివ్య మురళీధర్ రెడ్డిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి సర్పంచ్ కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. గ్రామ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
నూతన సర్పంచ్ శ్రీదివ్య మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >