Posted on 2025-12-23 17:45:10
డైలీ భారత్ న్యూస్, జూలూరుపాడు:జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న సాయి ఎక్సలెంట్ స్కూల్ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గురుకుల ఎంట్రన్స్ పరీక్షకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ స్కూల్ డైరెక్టర్ రమేష్ ప్రకటనలో తెలియజేశారు. 2026-2027 సంవత్సరాలకు 4,5,6,7,8 తరగతులకు తాను సాయి ఎక్సలెంట్ స్కూల్లో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు.గతంలో సాయి ఎక్సలెంట్ స్కూల్ శిక్షణ ద్వారా ఎంతో మంది విద్యార్థులను గురుకుల, నవోదయ,ఏకలవ్య పాఠశాలకు పంపి విజయం సాధించామని అన్నారు. గురుకులాల్లో ఐదవ తరగతి పరీక్ష ప్రవేశానకై 23-02-2026 న పరీక్ష జరుగుతుందని పరీక్ష ఉదయం 11:00AM గంటల నుంచి మధ్యాహ్నం 01:00PM గంట వరకు ప్రభుత్వం ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాల్లో జరుగుతుందని. గురుకులాల్లో సీట్ కోసం ప్రయత్నం చేసే విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకుని 21-12-2025 నుండి 06-02-2026 వరకు ఆన్లైన్లో 100 రూపాయల రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ఒక ఫోన్ నెంబర్ తో పాటు దరఖాస్తు మాత్రమే చేయాలని నిబంధన ఉందన్నారు.విద్యార్థులకు సాయి ఎక్స్లెంట్ స్కూల్లో డిసెంబర్ 27 తారీకు నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని. ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించిన వారికి కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించనున్నట్లు ఈ అవకాశాన్ని విద్యార్థిని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మరిన్ని వివరాల కోసం సాయి ఎక్సలెంట్ స్కూల్ 9441700094 మరియు9440296832 కు కాల్ చేసి మరిన్ని వివరాలను పొందవచ్చు అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >