Posted on 2025-12-20 20:11:45
అంత్యక్రియల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని ఏడవ డివిజన్ శక్తి కేంద్ర ఇంచార్జ్ బీజేపీ సీనియర్ నాయకుడు బట్టిగిరి ఆనంద్ (45) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు. ఆయన మరణించిన వార్త వినగానే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హుటాహుటిన తన ఇంటికి వెళ్లి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బట్టిగిరి ఆనంద్ తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరని ఆయన చెప్పుకొచ్చారు. ఎప్పుడు హిందూ ధర్మం కోసం బిజెపి పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తూ బిజెపి పార్టీకి ఒక సైనికుడిలా ఆయన పనిచేశారని ఆయన మరణించారని వార్త నమ్మలేకపోతున్నాను అని ఆయన పార్టీని తన కుటుంబ సభ్యులను అకస్మాత్తుగా వదిలి మరణించినప్పటికీ ఆయన జ్ఞాపకాలు అయన పార్టీ కోసం చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోనని ఆయన అన్నారు. ఆనంద్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ఏ చిన్న కష్టం వచ్చినా ఆదుకుంటానని ఎమ్మెల్యే ఆనంద్ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఆనంద్ పవిత్ర ఆత్మ శాంతించాలని మనసారా కోరుకుంటున్నానని ఆయన వెల్లడించారు. మరోవైపు సీనియర్ నేతైన ఆయన మృతి పట్ల బిజెపి శ్రేణుల్లో ఆయన కుటుంబం లో విషాదఛాయలు అలుముకున్నాయి. పట్టణ ప్రాంతంలోని 7వ డివిజన్ శక్తి కేంద్రం ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
బీజేపీ నాయకుడి ఆకస్మిక మృతితో పార్టీలో విషాదఛాయలు నెలకొన్నాయి. అర్బన్ ఎమ్మెల్యేతో పాటు ఆనంద్ పార్దివ దేహానికి బిజెపి పార్టీ సీనియర్ నేతలు, పుష్పగుచ్చాలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఇదిలా ఉండగా సాయంత్రం జరిగిన ఆనంద్ అంత్యక్రియాల్లో అర్బన్ ఎమ్మెల్యే హాజరయ్యారు. అంతేకాకుండా తన అనుచరుడు కావడంతో ఎమ్మెల్యే ఆనంద్ పాడే ను మోసి అందరి అభిమానాన్ని చాటుకున్నారు
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >