Posted on 2025-12-19 19:46:46
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: టీఎన్జీవో ఆధ్వర్యంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ అధ్యక్షతన, టీఎన్జీవో జిల్లా కార్యాలయం లోని స్వర్గీయ బి.స్వామినాథం సమావేశం మందిరం లో ప్రతి సంవత్సరం మాదిరిగా కులమతాలకు అతీతంగా క్రిస్టమస్ వేడుకలు (సపోస్ క్రిస్టమస్) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్ క్రైస్తవ మత గురువులు పాస్టర్ కృపాకర్, అహరోన్, శ్రీనివాస్, శ్యామ్, జగన్ హాజరై క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలను అంగరంగ వేగంగా నిర్వహించుకున్నారు
సమావేశాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథులు పాస్టర్ కృప మాట్లాడుతూ... క్రిస్మస్ వేడుకలు టిఎన్జీవో సంఘంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, కుల మతాలకు అతీతంగా ఇట్టి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అనంతరం టీఎన్జీవో అధ్యక్షుడు మాట్లాడుతూ.. జిల్లా ఉద్యోగులకు జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి, ఆ కరుణామయుడు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ శాంతిని ప్రేరేపిస్తూ, ప్రేమ అనురాగాలతో .... సేవా మార్గాన్ని ఎంచుకోవాలని తెలిపారు.
అనంతరం క్రైస్తవ సోదర సోదరీమణులు ఆధ్యాత్మిక పాటలతో అలరించిన ప్రతి ఒక్కరికి టీఎన్జీవోస్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమం లో వీరితోపాటు టిఎన్జీవో జిల్లా సహాధ్యక్షులు చిట్టి నారాయణరెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షులు మాణిక్యం, జాఫర్ హుస్సేన్, అతిక్ అహ్మద్, అర్బన్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, టీఎన్జీవో సలహాదారులు వనమాల సుధాకర్ గారు, మరియు వెస్లీ, సన్నీ, టీఎన్జీవో అన్ని యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు ,జిల్లా కార్యవర్గ సభ్యులు ఉద్యోగులు మరియు ముఖ్యంగా అన్ని శాఖల క్రిస్టియన్ మైనారిటీ ఉద్యోగులు జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ
Posted On 2026-04-23 18:36:19
Readmore >
కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం
Posted On 2026-04-23 18:22:34
Readmore >