Posted on 2025-12-19 08:07:52
డైలీ భారత్ న్యూస్, తిరుపతి జిల్లా: “అన్నా హెల్మెట్ ధరించండి"అనే నినాదాలతో తిరుపతి రూరల్ మండలంలోని ధనలక్ష్మి నగర్లో గల భాష్యం స్కూల్ విద్యార్థులు హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించి, అనంతరం మానవ హారం చేపట్టారు.
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్. సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని తిరుపతి రూరల్ పోలీస్ సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణరక్షణకు హెల్మెట్ ఎంతగానో దోహదపడుతుందన్న అంశాలను ప్రజలకు తెలియజేశారు.
ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ ధారణపై చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
#tirupati #bhasyam school
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >