| Daily భారత్
Logo




ఓటు హక్కు కేవలం హక్కు మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత

News

Posted on 2025-12-14 00:07:49

Share: Share


ఓటు హక్కు కేవలం హక్కు మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే ప్రతీ పౌరుడు ప్రజాస్వామిక సంస్కారాన్ని అలవరుచుకోవాలి. అది ఎక్కడో లేదు, నీలోనే ఉందని జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే పౌరులు తన బాధ్యత తెలుసుకోవాలి. రాష్ట్రం,గ్రామం,ప్రతి వాడా అభివృద్ధి చెందాలి, మనందరం బాగుండాలి అనే తాపత్రయం ఉంటేనే సరిపోదు, అందుకు ప్రతీ పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగం కల్పించిన ఆయుధం ఓటు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే నిర్ణేతలు.  ఓటు అనేది సాధారణ గుర్తు కాదు, పౌరుడు దేశ, రాష్ట్ర, గ్రామ  భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి” అని పేర్కొన్నారు.మనం నివసిస్తున్న దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల మాటే పరమాధికారం. ఇలాంటి వ్యవస్థలో పౌరుడు పొందే అత్యంత విలువైన హక్కు ఓటు హక్కు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం, 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి భారత పౌరుడు ఓటు వేసే హక్కును పొందుతాడు. ఈ హక్కు ప్రతి ఒక్కరికీ సమానంగా లభించడం మన ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం. ప్రజలు కులం, మతం, డబ్బు, మద్యం వంటి ప్రభావాలకు లోనుకాకుండా అభ్యర్థుల సేవాభావం, నిజాయితీ, పని తీరు మాత్రమే పరిశీలించి ఓటు వేయాలని ఆయన సూచించారు. ఓటు వేయకపోవడం అనేది ప్రజాస్వామ్యానికి నష్టం చేయడమేనని, ఒక చిన్న ఓటే మంచి నాయకులను ముందుకు తెచ్చే శక్తి కలిగి ఉంటుంది. ఎన్నికల సమయంలో యువత ఎక్కువగా జాగ్రత్తగా ఉండి, తన హక్కును వినియోగించడమే కాక, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలి. ప్రతి పౌరుడు ఓటు వేయడం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలి. మన ఓటు మన భవిష్యత్తు ను నిర్ణయిస్తుంది కాబట్టి అందరు ఓటు వేయాలని ఆపేక్షించారు.

Image 1

సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు

Posted On 2026-03-13 22:52:56

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్‌లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్

Posted On 2026-03-13 19:19:09

Readmore >
Image 1

పదవ తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

Posted On 2026-03-13 19:10:41

Readmore >
Image 1

ఏసీబీ కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Posted On 2026-03-13 18:06:25

Readmore >
Image 1

రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి : ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం

Posted On 2026-03-13 17:42:24

Readmore >
Image 1

ఎల్.పి.జి గ్యాస్ కొరత లేదు : కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

Posted On 2026-03-13 17:35:18

Readmore >
Image 1

సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!

Posted On 2026-03-13 17:33:46

Readmore >
Image 1

కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు

Posted On 2026-03-13 16:46:49

Readmore >
Image 1

అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-03-13 16:41:37

Readmore >
Image 1

అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్

Posted On 2026-03-13 16:39:38

Readmore >